By: ABP Desam | Updated at : 24 Jul 2022 08:29 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సుభాష్ పత్రిజీ(ఫైల్ ఫొటో)
Subhash Patriji No More : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను కడ్తాల్లోని మహేశ్వర మహా పిరమిడ్కు ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం పత్రిజీ మరణించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు తెలిపింది. సుభాష్ పత్రిజీ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ బోధన్లో జన్మించారు. కర్నూలు జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగం చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ను 2012లో నిర్మించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను పత్రిజీ స్థాపించారు.
పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ మరణం బాధాకరం . పిరమిడ్ కేంద్రం ద్వారా అనేక రకాల ధ్యానం ప్రచారంలో విశేషంగా చేసిన వారుతేసిన సేవలు గుర్తించదగినవి . వారి మరణం పట్ల నా సంతాపం , వారి భక్తులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను .#SubhashPatri pic.twitter.com/AA4uX1idEM
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 24, 2022
PA Deepak: విశాఖ వాసి టాలెంట్కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే
Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
రామాంతపూర్ ఘటనతో ఇంటర్బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం