అన్వేషించండి

Kumaraswamy: మా టార్గెట్ అది కాదు, కేసీఆర్‌తో భేటీపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ లో కేసీఆర్‌ తో సమావేశంపై కుమారస్వామి సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన పరిణామంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (సెక్యులర్‌) అగ్ర నేత హెచ్‌డీ కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇద్దరం జరిపిన చర్చలు మూడో కూటమి ఏర్పాటును ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లో కేసీఆర్‌ తో సమావేశంపై కుమారస్వామి సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంలో భాగంగా కేసీఆర్ కు ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. దేశంలోని రైతులు, మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్‌ వద్ద మంచి ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా అమలు చేయాలో ఆయనకు మాత్రమే తెలుసని మాట్లాడారు. 

తమది ఒక చిన్న పార్టీ అయినా, తాము కేసీఆర్‌కు ఎప్పుడూ సహకరిస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కుమారస్వామి స్పష్టత ఇచ్చారు. దేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎవరు గొంతు విప్పినా అందుకు తాము సహకరిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అనివార్యంగా మారిందని అన్నారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో లక్ష్యాలతో పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆ విషయంపై తాను కేసీఆర్‌ మాట్లాడుకున్నామని వివరించారు. ఆదివారం కేసీఆర్‌తో చర్చల అనంతరం దసరాలోగా కీలక నిర్ణయం వెల్లడిస్తామని కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే.

‘‘దేశ సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌కు సొంత ఆలోచన ఉంది. రైతులకు ఎలా సాయం చేయాలి, జాతీయ స్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు మా మద్దతును కోరారు. వారితో చేతులు కలపాలని ఆలోచిస్తున్నాము.’’ అని అన్నారు.

నిఖిల్ మాటను తప్పుగా అర్థం చేసుకోవద్దు
జేడీఎస్ యువజన అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘నేనే చాలాసార్లు చెప్పాను. ఈ ఎన్నికలు మనకు కీలకం. రానున్న రోజులకు ఈ ఎన్నికలే పునాది. రాబోయే 25 ఏళ్లలో ఏం జరుగుతుందనేది ముఖ్యం. అందుకు ఈ ఎన్నికలు చాలా కీలకం. దీనికి వేరే అర్థం చెప్పాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు

2024 ఎన్నికలే సరైన సమయం - కేసీఆర్
సోమవారం రోజు వీరిద్దరి భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సామాన్య ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైంది. సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడానికి బదులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇలాంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలి. కేంద్రంలో అధికారం నుంచి బీజేపీని గద్దె దించేందుకు 2024 ఎన్నికలే సరైన సమయం’’ అని అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో గత ఆదివారం (సెప్టెంబరు 13) భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ముందుగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కుమారస్వామి ట్విటర్ ద్వారా వెల్లడించారు. మంత్రి కేటీఆర్ తో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వీటితో పాటు జాతీయ రాజకీయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్లు కుమారస్వామి తెలిపారు. ఆ భేటీ అనంతం కుమారస్వామి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఆయనను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget