అన్వేషించండి

ప్రభుత్వానికి సొంత ఎజెండా ఉంది, అఖిల పక్ష భేటీలో ప్రహ్లాద్ జోషి

విపక్షాలు మహిళా బిల్లు గురించి ప్రస్తావించాయని, అయితే ప్రభుత్వానికి సొంతం ఎజెండా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. 

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో ఆదివారం సాయంత్రం అఖిలపక్షం భేటీ జరిగింది. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై అన్ని పార్టీలకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ సందర్భంగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరింది అధికార పార్టీ. విపక్షాలు మహిళా బిల్లు గురించి ప్రస్తావించాయని, అయితే ప్రభుత్వానికి సొంతం ఎజెండా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. 

మరోవైపు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రాంతీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం తెలపాలని బిజు జనతాదళ్‌ , భారత్‌ రాష్ట్ర సమితి పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక ఘర్షణలతోపాటు మణిపుర్‌లో పరిస్థితి వంటి అంశాలను లేవనెత్తుతామని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ స్పష్టం చేశారు. 

లోక్‌సభలో ఉప సభాపక్షనేత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభ పక్షనేత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి హజరయ్యారు. కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌదరి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, డీఎంకే కనిమొళి, టీడీపీ రామ్‌మోహన్‌ నాయుడు, టీఎంసీ డెరెక్‌ ఒబ్రెయిన్‌, ఆప్‌ తరఫున సంజయ్‌ సింగ్‌, బీజేడీ సస్మిత్‌ పాత్ర, బీఆర్‌ఎస్‌ నుంచి కే కేశవరావ్‌, ఆర్‌జేడీ మనోజ్‌ షా, ఎస్పీ నుంచి రామ్‌గోపాల్‌ యాదవ్‌లు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.

19వ తేదీన కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18న 75ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభలు వెల్లడించాయి. ఇండియా పేరును భారత్ గా మారుస్తారన్న వార్తలు వస్తుండటంతో...విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 5 బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.. ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన ది అడ్వకేట్స్‌ సవరణ బిల్లు-2023, ద ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బిల్లులు లోక్‌సభ ముందుకు రానున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget