అన్వేషించండి

ప్రభుత్వానికి సొంత ఎజెండా ఉంది, అఖిల పక్ష భేటీలో ప్రహ్లాద్ జోషి

విపక్షాలు మహిళా బిల్లు గురించి ప్రస్తావించాయని, అయితే ప్రభుత్వానికి సొంతం ఎజెండా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. 

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో ఆదివారం సాయంత్రం అఖిలపక్షం భేటీ జరిగింది. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై అన్ని పార్టీలకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ సందర్భంగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరింది అధికార పార్టీ. విపక్షాలు మహిళా బిల్లు గురించి ప్రస్తావించాయని, అయితే ప్రభుత్వానికి సొంతం ఎజెండా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. 

మరోవైపు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రాంతీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం తెలపాలని బిజు జనతాదళ్‌ , భారత్‌ రాష్ట్ర సమితి పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక ఘర్షణలతోపాటు మణిపుర్‌లో పరిస్థితి వంటి అంశాలను లేవనెత్తుతామని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ స్పష్టం చేశారు. 

లోక్‌సభలో ఉప సభాపక్షనేత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభ పక్షనేత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి హజరయ్యారు. కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌదరి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, డీఎంకే కనిమొళి, టీడీపీ రామ్‌మోహన్‌ నాయుడు, టీఎంసీ డెరెక్‌ ఒబ్రెయిన్‌, ఆప్‌ తరఫున సంజయ్‌ సింగ్‌, బీజేడీ సస్మిత్‌ పాత్ర, బీఆర్‌ఎస్‌ నుంచి కే కేశవరావ్‌, ఆర్‌జేడీ మనోజ్‌ షా, ఎస్పీ నుంచి రామ్‌గోపాల్‌ యాదవ్‌లు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.

19వ తేదీన కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18న 75ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభలు వెల్లడించాయి. ఇండియా పేరును భారత్ గా మారుస్తారన్న వార్తలు వస్తుండటంతో...విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 5 బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.. ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన ది అడ్వకేట్స్‌ సవరణ బిల్లు-2023, ద ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బిల్లులు లోక్‌సభ ముందుకు రానున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget