అన్వేషించండి

One Nation One Election: కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ- పార్టీలు, లా కమిషన్ సూచనలు ఆహ్వానించనున్న ప్యానెల్

One Nation One Election: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ జరిగింది. కమిటీ లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనే దానిపై చర్చించినట్లు సమాచారం.

One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. సమావేశాన్ని ఉపోద్ఘాతంగా పేర్కొంటూ, కమిటీకి ఇచ్చిన ఆదేశంపై ఎలా వెళ్లాలనే దానిపై రోడ్ మ్యాప్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఒకే దేశం - ఒకే ఎన్నికలపై లా కమిషన్, జాతీయ రాష్ట్ర పార్టీల సూచనలు కూడా ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించినట్లు సమాచారం.

'జమిలి ఎన్నికకు ఎదురయ్యే సమస్యలపై అభిప్రాయాలను కోరేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ నిర్ణయించింది. సూచనలు చేయడానికి లా కమిషన్ ను కూడా ప్యానెల్ ఆహ్వానించింది' అనని కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చీఫ్ ఎన్కే సింగ్ లు ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ కూడా కోవింద్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఏకకాలంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి.. రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం, కొన్ని ఇతర చట్టాలు, నియమాలకు కొన్ని సవరణలను పరిశీలించి, సిఫార్సులు కూడా ప్యానెల్ చేస్తుంది. అలాగే ఎన్నికలు నిర్వహించలేని దశలు, సమయ వ్యవధిని ప్రత్యేకంగా సూచించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సూచించడానికి ప్యానెల్ కు బాధ్యతలు అప్పగించారు. 

హంగ్ హౌజ్, అవిశ్వాస తీర్మాననం ఆమోదించడం లేదా అలాంటి ఏదైనా సంఘటన వంటి పరిస్థితులకు సాధ్యమైన పరిష్కారాలను కూడా కమిటీ సూచించాల్సి ఉంటుంది. దీని వల్ల జమిలి ఎన్నికల చక్రాన్ని కొనసాగించేందుకు అవసరమైన రక్షణలను, రాజ్యాంగానికి అవసరమైన సవరణలను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడానికి అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, పేపర్-ట్రయిల్ మెషీన్లు, పోలింగ్, భద్రతా సిబ్బంది, లాజిస్టిక్స్ సౌకర్యాలను కూడా ప్యానెల్ చర్చిస్తుంది.

ముందస్తు ఎన్నికలు..? 

కేంద్రం ఒకే దేశం, ఒకే ఎన్నికపై కసరత్తు చేస్తున్న క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సంకేతాలిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ఏమీ లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశాలు కూడా లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ గడువు ముగిసిపోయేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సేవ చేస్తారని వెల్లడించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుండటాన్ని కొట్టి పారేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Advertisement

వీడియోలు

West Indies Cricket | ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వెస్ట్ ఇండీస్ ఓ విచిత్రం | ABP Desam
Adilabad Seasonal Fruits : ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ గా లభించే పండ్లు.. ఉపాధి పొందుతున్న ఆదివాసీలు
నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్..  47 ఏళ్ల భారత నిరీక్షణ తీరేనా?
మరి కొద్ది రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్.. కీలక ప్లేయర్ దూరం
అంతర్జాతీయ క్రికెట్‌కి క్రిస్ వోక్స్ వీడ్కోలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Kantara Ticket Price In AP: ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
New GST Rates: GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
Women ODI World Cup 2025: సూర్య అనుకున్నది చేశాడు! హర్మన్‌ప్రీత్ ఏం చేస్తుంది? పాక్ కెప్టెన్‌తో చేయి కలపాలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
సూర్య అనుకున్నది చేశాడు! హర్మన్‌ప్రీత్ ఏం చేస్తుంది? పాక్ కెప్టెన్‌తో చేయి కలపాలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Konaseema News:కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
Embed widget