మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని యశ్వాడి హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో పర్బానీ జిల్లాలో యశ్వాడిలో హనుమాన్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని, మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- మహారాష్ట్ర పర్బానీలో హనుమాన్ ఆలయం పైకప్పు కూలింది.
- నిర్మాణంలో ఉన్న సభా మండపం కూలి ఏడుగురు మరణించారు.
- 32 మంది గాయపడ్డారు; సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.
- ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Temple wall collapse in Parbhani, Maharashtra | ముంబై: మహరాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో గర్బగుడి ముందు నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు కూలి భక్తులపై పడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పరభణి జిల్లా మానవత్ తాలూకాలోని యశవాడిలోని హనుమాన్ ఆలయంలో శనివారం (20 జూన్) పెద్ద ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ హనుమాన్ ఆలయ గర్భగుడి ముందు నిర్మాణంలో ఉన్న సభా మండపం పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో 7 గురు భక్తులు మరణించగా, 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యంత్రాంగం తక్షణమే సహాయక, రెస్క్యూ చర్యలను ప్రారంభించింది. శనివారం కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు భారీ సంఖ్యలో హనుమాన్ దర్శనానికి వస్తుంటారు. ఘటనా స్థలంలో పలు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ బృందాలను కూడా తీసుకొచ్చారు. జిల్లా అధికారులు, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
महाराष्ट्रात, परभणी येथे भिंत कोसळल्यामुळे झालेल्या जीवितहानीबद्दल अत्यंत दु:ख होत आहे. या दुर्घटनेत ज्यांनी आपल्या प्रियजनांना गमावले आहे, माझ्या संवेदना त्यांच्यासोबत आहेत. जखमींच्या प्रकृतीत लवकरात लवकर सुधार व्हावा, ही प्रार्थना: पंतप्रधान @narendramodi
— PMO India (@PMOIndia) June 20, 2026
ఆలయంలో విషాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
మహారాష్ట్రంలోని పర్బానీ జిల్లాలో హనుమాన్ ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్రలోని పరభణిలో గోడ కూలి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది’ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Frequently Asked Questions
పర్బానీలో జరిగిన ప్రమాదం ఏమిటి?
ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది?
ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని పర్బానీ జిల్లా, మానవత్ తాలూకాలోని యశ్వాడిలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో జరిగింది.
ప్రమాదంలో ఎంతమంది భక్తులు మరణించారు లేదా గాయపడ్డారు?
ఈ ప్రమాదంలో 7 గురు భక్తులు మరణించారు మరియు 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది?
ఈ ప్రమాదం శనివారం (జూన్ 20) మధ్యాహ్నం జరిగింది. ఆ రోజు శనివారం కావడం వల్ల ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలా స్పందించారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ట్రెండింగ్ వార్తలు























