అన్వేషించండి

Rajnath Singh : పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధం- బట్ కండిషన్స్‌ అప్లై అంటున్న రాజ్‌నాథ్ సింగ్

Jammu & Kashmir Elections 2024: టెర్రరిజంకి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపేస్తేనే భారత్‌ చర్చలకు సిద్ధమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్పష్టం చేశారు.

Rajnath Singh made a statement on Pakistan: టెర్రరిజంకి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపేస్తేనే భారత్‌ చర్చలకు సిద్ధమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్పష్టం చేశారు. జమ్ము- కశ్మీర్‌ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉందని.. ఐతే పాకిస్తాన్‌ తన వైఖరిని మార్చుకుంటేనే అవి సాధ్యం అవుతాయని అన్నారు. సోమవారం బనిహాల్‌ సభలో భాజపా అభ్యర్థి మొహమద్‌ సలీమ్ భట్‌ తరపున ప్రచారం నిర్వహించిన రాజ్‌నాథ్‌.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా నరేంద్రమోదీ సర్కారు జమ్ము కశ్మీర్ సంపద విస్తరణకు దోహదం చేసిందని వివరించారు. కశ్మీర్ లోయలో పాక్ అరాచకాలకు చాలా వరకు సక్సెస్‌ ఫుల్‌గా అడ్డుకట్ట వేయగలిగామన్నారు. దాయాది దేశం సరిహద్దు దేశాలతో సంబంధాలను పెంచుకోవడం కంటే ఆ దేశాల్లో విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. స్నేహితులను మార్చుకోగలం కానీ ఇరుగు పొరుగు వారు ఎప్పటికీ మారరన్న విషయాన్ని ఇస్లామాబాద్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

జమ్ము కశ్మీర్‌లో టెర్రరిజానికి బలవుతోందీ ముస్లీంలే: రాజ్‌నాథ్

పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు బలితీసుకుంటోంది ముస్లీంలనేనని రాజ్‌నాథ్ అన్నారు. జమ్ము కశ్మీర్‌లో జరిగే టెర్రర్‌ ఎటాక్స్‌లో హిందువులతో పోల్చితే మస్లీంలనే ఎక్కువ మందిని పాక్‌ పొట్టన పెట్టుకుంటోందని చెప్పారు. టెర్రర్‌ మరణాల్లో 80శాతం ముస్లీం కుటుంబాల నుంచే ఉన్నాయన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు కూడా భారత్‌లో కలవాలని సూచించారు. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్‌లోని ప్రజలను ఆ దేశ ప్రభుత్వం ఎప్పుడూ ఫారినర్స్‌గానే చూస్తోందని.. భారత్‌ మాత్రం వారిని ఇండియన్స్‌గా పరిగణిస్తుందని తెలిపారు. ఇటు జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌ సంపద పెరిగిందన్నారు. ఈ ఆర్టికల్‌ను 2019లో నరేంద్రమోదీ సర్కారు రద్దు చేయగా అప్పటి నుంచి భారత్‌- పాక్ మధ్య సంబంధాల్లో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని.. రాళ్ల దాడులు తగ్గాయని కేంద్రం పేర్కొంది.  

జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు

జమ్ముకశ్మీర్‌లో తొలి దశ సెప్టెంబర్‌ 18న రెండో దశ 25న మూడో దశ అక్టోబర్‌ 1న జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. జమ్ము కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జమ్ము కశ్మీర్ ఎన్నికల వేళ కొన్ని వారాలుగా కశ్మీర్‌లోయలో ఉగ్రకార్యకలాపాలు పెరిగాయి.

జూన్‌లో పూంఛ్‌ సెక్టార్‌లో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఒక అధికారి చనిపోయాడు. ఈ దాడిని భద్రతాబలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. జులైలో కుప్వారాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని సెక్యూరిటీ ఫోర్సెస్‌ మట్టుపెట్టాయి. అదే నెలలో దోడాలో పాక్‌ నుంచి ఆపరేట్ చేస్తున్న ఉగ్రసంస్థ జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మరణించారు. కథువాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన మరో దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టు నెలలోనూ ఉగ్రదాడులు జరిగాయి. 2023 జూన్‌లోనూ రైసీ ఆధ్యాత్మిక యాత్రపై ఉగ్రదాడికి తెగపడి 9 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్‌తో శాంతి చర్చలు జరగాలంటే ముందుగా పాకిస్తాన్ ఈ నేలపై నెత్తురు పారించడం ఆపాలని పదేపదే కేంద్రం స్పష్టం చేస్తూ వస్తోంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balapur Laddu Auction 2024: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి
బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి
Andhra News: విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన
విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన
Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: సచివాలయం దాటిన ఖైరతాబాద్ గణేష్‌
సచివాలయం దాటిన ఖైరతాబాద్ గణేష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balapur Laddu Auction 2024: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి
బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి
Andhra News: విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన
విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ - నడవలేని స్థితిలో బాలికలు, అల్లూరి జిల్లాలో అమానవీయ ఘటన
Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: సచివాలయం దాటిన ఖైరతాబాద్ గణేష్‌
సచివాలయం దాటిన ఖైరతాబాద్ గణేష్‌
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
Bigg Boss 8 Telugu Day 16 Promo: అతడి హగ్‌ కంఫర్టబుల్‌గా లేదు - యష్మి గౌడ ఎమోషనల్ - ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్ లో పృథ్వీ, నబిల్ ఫైట్ 
అతడి హగ్‌ కంఫర్టబుల్‌గా లేదు - యష్మి గౌడ ఎమోషనల్ - ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్ లో పృథ్వీ, నబిల్ ఫైట్ 
RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
Embed widget