అన్వేషించండి

Congress On Elections Results: సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం, ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందనేంటంటే?

Congress On Elections Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పుని గౌరవిస్తామని స్పష్టం చేశారు.

Congress On Elections Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని రాహుల్ అన్నారు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నానన్నారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 

పంజాబ్ లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్ ను కూడా కాంగ్రెస్ కోల్పోయింది. పంజాబ్ లో కేవలం 18 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం  అయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్ లో కాంగ్రెస్ దిగ్గజాలు చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓటమి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌, గోవాలో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంతగా కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. గోవాలోనూ కాంగ్రెస్ వెనుకబడింది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు ఆశాజనకంగా వచ్చిన ఫలితాల్లో మాత్రమే విజయం రివర్స్ అయింది. గోవాలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ గా అవతరించింది. 

యూపీలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం 

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అంతా తానై ప్రచారం చేశారు. అయినప్పటికీ గతంలో కంటే సుమారు 3 శాతం పార్టీ ఓటు షేరును కోల్పోయినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా భారీగా ఓటు షేర్ కోల్పోయింది. 2017లో ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచినప్పుడు కాంగ్రెస్ ఓటు షేర్ 38.5 శాతంగా ఉంది. గోవాలోనూ గతంలో  కంటే 8 స్థానాల్లో కాంగ్రెస్ వెనుకబంది. అలాగే మణిపూర్‌ లోనూ  కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 2017లో ఇక్కడ 35.1 శాతం ఓటు షేర్ రాగా, తాజాగా 17 శాతానికే పరిమితం అయ్యేలా ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును తాను సవినయంగా అంగీకరిస్తున్నట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, ఇంకా కొనసాగిస్తానని ఆమె తెలిపారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Balakrishna: 'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
Embed widget