అన్వేషించండి

Caste Census : కుల గణనపై కేంద్రం కీలక నిర్ణయం- వచ్చే ఏడాది నుంచి ప్రక్రియ ప్రారంభం

Caste Census : కుల గణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో ప్రక్రియను చేపట్టాలని అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ ప్రకటించింది.

Caste Census : కుల గణన, జనాభా లెక్కలపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కులగణన ప్రక్రియను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతోంది. 1 అక్టోబర్‌ 2026 నుంచి తొలి దశ కులగణన స్టార్ట్ చేయనున్నట్టు పేర్కొంది. దీన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని చూస్తోంది. రెండో దశను మార్చి 1, 2027 నుంచి స్టార్ట్ చేయనున్నారు. అదే సమయంలో, లడఖ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత రాష్ట్రాల్లో అక్టోబర్ 1, 2026 నుంచి జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. కుల గణనతోపాటు, జనాభా లెక్కలు 2 దశల్లో ప్రారంభిస్తారు.  

సాధారణంగా జనాభా లెక్క సమయంలో దేశవ్యాప్తంగా  అడిగే ప్రశ్నల జాబితాకు ఈసారి కొత్తగా కులానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్నను జోడిస్తుంది. ఇటీవల, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, తదుపరి జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చడానికి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. 

జాతీయ జనాభా రిజిస్టర్ (NPR)ను నవీకరించడానికి సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు చెపడుతుంటారు. 2021 లో నిర్వహించాల్సి ఉంది, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. 2011 లో జరిగిన చివరి జనాభా లెక్కింపులో భారతదేశ జనాభా 121 కోట్లకుపైగా నమోదైంది.

హోం మంత్రిత్వ శాఖ ఏమి చెప్పిందో తెలుసా?

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఇలా చెప్పింది, "కులాల గణనతోపాటు జనాభా గణన-2027 ను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. జనాభా గణన-2027 తేదీ మార్చి, 2027 1న ఉంటుంది."

"లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల‌్లోని నాన్-సింక్రోనస్ మంచు ప్రాంతాలకు 1 అక్టోబర్, 2026న ప్రారంభం అవుతుంది. 1948 జనాభా లెక్కల చట్టంలోని సెక్షన్ 3లోని నిబంధన ప్రకారం, తేదీలతో జనాభా గణన నిర్వహించాలనే ఉద్దేశ్యానికి సంబంధించిన నోటిఫికేషన్ 16.06.2025న అధికారిక గెజిట్‌లో ప్రచురితం అవుతుంది " అని ప్రకటన పేర్కొంది.

జనాభా లెక్కల ప్రక్రియలో, సంబంధిత అధికారులు దేశ ప్రజలకు సంబంధించిన డేటాను సేకరిస్తారు. ఇందులో సామాజిక, జనాభా, సాంస్కృతిక, ఆర్థిక డేటా ఉంటుంది. ఈ డేటా విధాన రూపకల్పన, అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

భారత్‌లో ఎప్పుడు జనాభా లెక్కలు నిర్వహించారు

భారత దేశంలో జనాభా లెక్కలు 1872లో మొదటిసారి బ్రిటీష్ వారి కాలంలో జరిగాయి. లార్డ్ మయో ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరిగింది. అది వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో లెక్కింపు జరిగింది. కానీ 1881 మాత్రం దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే సమయంలో ఒకే విధానంలో జనాభా లెక్కలు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చేపడుతున్నారు. 

స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే విధానాన్ని కొనసాకించారు. 1948లో ప్రత్యేకంగా జనాభా లెక్కల చట్టాన్ని అమలు చేసి స్వాంతత్య్ర భారత దేశంలో 1951లో జనాభా లెక్కలు చేపట్టారు. ఇలా ఇప్పటి వరకు 15సార్లు జనాభాలున లెక్కిస్తూ వచ్చారు. వచ్చే ఏడాది నుంచిజరిగేది 16వ జనాభా లెక్కలు అవుతాయి. 

2011లో జరిగిన జనాభా లెక్కల వివరాలు ఏంటీ?

2011లో చేపట్టిన జనాభా లెక్కలకు సుమారు 2200 కోట్లు రూపాయలు ఖర్చు అయ్యింది. 

2011 లెక్కల ప్రకారం జనాభా లెక్కలు ఇలా ఉన్నాయి. 

  • మొత్తం జనాభా- 1,21,08,54,977
  • పురుషులు- 62,37,24,598
  • మహిళలు- 58,64,69,294
  • గ్రామీణ జనాభా- 83.36 కోట్లు 
  • పట్టణ జనాభా- 37.71 కోట్లు 
  • అక్షరాస్యత రేటు- 74.04 శాతం 
  • పురుషుల్లో అక్షరాస్యత రేటు- 82.1శాతం
  • స్త్రీలలో అక్షరాస్యత రేటు- 65.46 శాతం 
  • స్త్రీ పురుష నిష్పత్తి- వెయ్యిమంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 
  • పిల్లల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి(ఆరేళ్ల లోపు)- 919
  • జనాభా పెరుగుదల రేటు 177 శాతం(2001-2011)

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget