Bihar News: బిహార్లో ఎగ్జిట్ ఫలితాలతోనే కాంగ్రెస్కు షాక్- పార్టీకి రాజీనామా చేసిన షకీల్ అహ్మద్
Bihar News: బిహార్లో ఎన్డీఏదే విజయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఈ వివరాలు వస్తున్న టైంలోనే కాంగ్రెస్కు బిగ్షాక్ తగిలింది. సీనియనర్ నేత షకీల్ అహ్మద్ రాజీనామా చేశారు.

Bihar News: బిహార్లో ఓటింగ్ ముగియగానే ఆ పార్టీకి పెద్ద షాక్ ఇస్తూ ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షకీల్ అహ్మద్ తన రాజీనామాను ప్రకటించారు. అహ్మద్ యుపిఎ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన తన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు.
షకీల్ అహ్మద్ తన లేఖలో, "నేను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీకి తెలియజేస్తూ ఏప్రిల్ 16, 2023 నాటి నా లేఖను గుర్తుచేసుకోండి. ఇటీవల, నా ముగ్గురు కుమారులు కెనడాలో నివసిస్తున్నారని, వారిలో ఎవరికీ రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి లేదని, కాబట్టి వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించాను. అయితే, నా జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కానీ, మిస్టర్ ప్రెసిడెంట్, ఇది ఇకపై సాధ్యం కాదని అనిపిస్తుంది."
"కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నేను బరువెక్కిన హృదయంతో నిర్ణయించుకున్నాను" అని ఆయన రాశారు. "పార్టీని వీడటం అంటే నేను వేరే ఏ పార్టీలో చేరుతున్నానని కాదు. నాకు వేరే ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. నా పూర్వీకుల మాదిరిగానే, నాకు కాంగ్రెస్ పార్టీ విధానాలు, సిద్ధాంతలపై అచంచలమైన నమ్మకం ఉంది. నేను నా జీవితాంతం కాంగ్రెస్ పార్టీ విధానాలు, సూత్రాలకు శ్రేయోభిలాషిగా, మద్దతుదారుగా ఉంటాను. నా చివరి ఓటు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుంది."
#WATCH | Delhi | On his resignation from the Congress, former Bihar Minister Shakeel Ahmad says, "... I have mentioned that I am resigning with a heavy heart because of differences with my fellow party leaders. I will continue to support the party's policies and principles. I… https://t.co/x4htPe2EXM pic.twitter.com/FvfqAyER1M
— ANI (@ANI) November 11, 2025
నేను ఐదుసార్లు ఎమ్మెల్యేని - షకీల్ అహ్మద్
అహ్మద్ ఇలా రాశారు, "మీ సమాచారం కోసం, నా తాత దివంగత అహ్మద్ గఫూర్ 1937లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1948లో ఆయన మరణించిన తర్వాత, నా తండ్రి షకూర్ అహ్మద్ 1952-1977 మధ్య ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, వివిధ పదవులు నిర్వహించారు. 1981లో నా తండ్రి మరణించిన తర్వాత, నేను 1985 నుంచి ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యాను."
నేను ఇప్పటికే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను, కానీ ఓటింగ్ ముగిసిన తర్వాత ఈరోజే దానిని ప్రకటిస్తున్నాను, ఎందుకంటే ఓటింగ్కు ముందు ఎటువంటి తప్పుడు సందేశం వెళ్లకూడదని, నా కారణంగా పార్టీ ఐదు ఓట్లను కూడా కోల్పోకూడదని నేను కోరుకుంటున్నాను అని అహ్మద్ రాశారు.
"అనారోగ్యం కారణంగా, నేను ప్రచారం చేయలేకపోయాను, కానీ ఈసారి కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయని, మా సంకీర్ణం బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను ఆశిస్తున్నాను. చివరగా, పార్టీలో ప్రస్తుతం ఉన్న కొంతమంది వ్యక్తులతో నాకు విభేదాలు ఉండవచ్చు, కానీ పార్టీ విధానాలు,సూత్రాలపై నాకు అచంచల విశ్వాసం ఉందని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. దయచేసి ఈ లేఖను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నా రాజీనామాగా పరిగణించండి" అని ఆయన రాశారు.




















