అన్వేషించండి

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

Ram Mandir Consecration: అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ వేడుకల్లో ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ క్రతువులు మంగళవారం ప్రారంభమయ్యాయి. 

Ayodhya Ram Mandir Inauguration News: అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir)లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ వేడుకల్లో ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ (Ram Mandir Pran Pratishtha) క్రతువులు మంగళవారం ప్రారంభమయ్యాయి. సరయు నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. వారం రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి 22వ తేదీ రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రాణప్రతిష్ట క్రతువులు ప్రారంభమైన సందర్భంగా ఆలయ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూసేయండి.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

రామాలయ సముదాయంలో బంగారు పూతతో కూడిన 14 గేట్లు ఏర్పాటు చేశారు. వాటిపై ఏనుగు, తామర, నెమలి మొదలైన బొమ్మలు చెక్కబడ్డాయి. తలుపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ తెలిపింది. 

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం.. ఆలయం 1,000 ఏళ్లు నిలిచేలా నిర్మించబడింది. వెయ్యి సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేదు. ఆలయ నిర్మాణంలో సిమెంటు, కాంక్రీటు, ఇనుము ఉపయోగించలేదు.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామ నామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయల తరహాలో గుజారా చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

మొత్తం మూడు అంతస్తుల్లో ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. మొత్తం ఆలయాన్ని నిర్మించడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. 

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు, శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఇంత పెద్ద ఆలయాన్ని దర్శించుకోవాలంటే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందే కదా. అలాంటి వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.  

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

ఆలయ గర్భగుడిలో బాల రాముడు రూపంలో కనిపిస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భరత్ పూర్ నుంచి గులాబి రంగు బన్సీపహార్ పూర్ సాండ్ స్టోన్‌ను వినియోగించారు.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయ్ లాండ్ నుంచి మన్ను వస్తుందట. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయ్‌లాండ్ లోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు అయోధ్య రామాలయం నమూనాను ఒకటి థాయ్ లాండ్‌లో నిర్మించారు.

రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లనుంది. 

నేటి నుంచి ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు

  • జనవరి 16: అయోధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ నియమించిన హోస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం  ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ చేపట్టారు.
  • జనవరి 17: రామ్ లల్లా విగ్రహం ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు అయోధ్య ఆలయానికి చేరుకుంటారు.
  • జనవరి 18: గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు నిర్వహిస్తారు.
  • జనవరి 19 : యజ్ఞం ప్రారంబంకానుంది. తర్వాత 'నవగ్రహ' 'హవన్' స్థాపన జరుగుతుంది.
  • జనవరి 20: రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో కడుగుతారు, ఆ తర్వాత వాస్తు శాంతి 'అన్నాధివాస్' ఆచారాలు జరుగుతాయి.
  • జనవరి 21: రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, చివరకు శంకుస్థాపన చేస్తారు.
  • జనవరి 22: ప్రధాన "ప్రాణ్‌ ప్రతిష్ఠ" వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
  • జనవరి 23: భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. జనవరి 21 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి భక్తులను రానివ్వరు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget