అన్వేషించండి

Assam Earthquake: గాఢనిద్రలో ప్రజలు, 5.1 తీవ్రతతో అస్సాంలో భారీ భూకంపం.. భయంతో లేచి ఇళ్ల నుంచి పరుగులు

Earthquake in Assam | అస్సాం మోరిగావ్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు ఈశాన్య భారతదేశమంతటా వ్యాపించాయి. ప్రస్తుతానికి ప్రాణనష్టం ఆస్తి నష్టం సంభందించి వివరాలు రాలేదు.

Assam Earthquake | అస్సాంలో సోమవారం (5 జనవరి) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం, భూకంప కేంద్రం అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో నమోదైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. అస్సాంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం సోమవారం ఉదయం సుమారు 4 గంటల 17 నిమిషాలకు సంభవించింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు మెలుకుని ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది..

అస్సాంతో పాటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం ఉంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఉండటంతో, ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపించాయి. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

ఎలాంటి నష్టం లేదు

తాజాగా సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాలేదు. అధికారులు, విపత్తు నిర్వహణ విభాగం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సున్నితమైన ప్రాంతాల నుంచి నిరంతరం సమాచారం సేకరిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి

ప్రజలు వదంతులను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని అస్సాం అధికారులు విజ్ఞప్తి చేశారు. భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వాలు సూచించే భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అస్సాం

అస్సాం చరిత్రలో భూకంపాల వల్ల పలు విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఒకటిగా ఉంది. దీనికి ప్రధాన కారణం భారత ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొనడమే అని నిపుణుల అభిప్రాయం. ఈ ఘర్షణ కారణంగా భూమి లోపల తరచుగా కదలికలు వస్తూ, తీవ్రమైన ప్రకంపనలు నమోదవుతాయి.

1897 నాటి షిల్లాంగ్ భూకంపం, అన్నీ కుదిపేసింది

12 జూన్ 1897న సంభవించిన షిల్లాంగ్ భూకంపం అస్సాం, మొత్తం ఈశాన్య భారతదేశానికి భయంకరమైన విపత్తుగా మారింది. ఈ భూకంపం తీవ్రత 8 కంటే ఎక్కువగా నమోదైంది. వేలాది మంది ప్రజలు దీని బారిన పడి నష్టపోయారు. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. భారీ సంఖ్యలో ఇళ్లు, రోడ్లు, భవనాలు కూలిపోయాయి. ఈ భూకంపం ప్రభావం ఎంతగా ఉందంటే, కలకత్తా వంటి దూర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనుల ప్రభావం కనిపించింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Advertisement

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget