అన్వేషించండి

Arvind Kejriwal: 'వైద్య పరీక్షలు చేయించుకోవాలి' - మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంలో కేజ్రీవాల్ పిటిషన్

Delhi Liquor Case: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మరో 7 రోజులు పొడిగించాలని కోరారు.

Arvind Kejriwal Requested Supreme Court To Extends Interim Bail: ఢిల్లీ లిక్కర్ పాలసీకి (Delhi Liquor Policy) సంబంధించి మనీ లాండరింగ్ (Money Laundering) ఆరోపణలతో అరెస్టై ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejrwal) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రచారం క్రమంలో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను మరో 7 రోజులు పొడిగించాలని కోరారు. కాగా, లిక్కర్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యం అవుతుండడంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

ఆరోగ్య సమస్యలతో..

కేజ్రీవాల్ తన ఆరోగ్య సమస్యలను సైతం పేర్కొంటూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయనకు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని.. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యుల బృందం తెలిపింది. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ 7 కిలోల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కేజ్రీవాల్ PET - CT స్కాన్ తో సహా కీలకమైన వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని.. ఇందుకోసం మరో 7 రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. 

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలని దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసినా వాటికి.. స్పందించకపోవడంతో ఈడీ తమ కస్టడీలోకి తీసుకుంది. అనంతరం కోర్టులో హాజరు పరచగా విచారించి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారం క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసిన అనంతరం జూన్ 2న ఆయన అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంది. అయితే, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పైనా..

అటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ వాదనలు విననుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ఆమె ఢిల్లీ ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా మార్చి 26 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి జైల్లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.