అన్వేషించండి

Cheetah Dies: మరో విషాదం - మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

Cheetah Dies In Madhya Pradesh's Kuno National Park: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చిన చిరుత అస్వస్థతకు గురైంది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.

Cheetah Dies In Madhya Pradesh's Kuno National Park: దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చిన చిరుత అస్వస్థతకు గురైంది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అయితే చిరుత మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని ఎంపీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ తెలిపారు. ఉదయ్ అనే మగ చిరుత ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అంత చురుకుగా కనిపించలేదని, అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. వెటర్నరీ డాక్టర్లు, చిరుత సంరక్షణ నిపుణులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం 4 గంటల సమయంలో చిరుత ఉదయ్ చనిపోయిందని ఓ ప్రకటనలో తెలిపారు.

దక్షిణాఫ్రికాలోని వాటర్‌బర్గ్ బయోస్పియర్ నుంచి దక్ష, నిర్వా, వాయు, అగ్ని, గామిని, తేజస్, వీర, సూరజ్, ధీర, ప్రభాస్, పావక్ అనే  11 చిరుతలతో పాటు ఉదయ్‌ అని మగ చిరుతను భారత్ కు తీసుకొచ్చారు. దేశంలో ఎప్పుడో అంతరించిన చిరుతలను మళ్లీ సంరక్షించడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు. 

దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన 12 చిరుతలలో 7 మగ చిరుతలు ఉన్నాయి. అందులో మగ చిరుత ఉదయ్ కూడా ఉంది. అయితే వాటర్ బర్గ్ బయో స్పియర్ నుంచి తీసుకొచ్చిన చిరుతలలో చనిపోయిన రెండో చిరుత ఉదయ్. మార్చి నెలలో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో షాషా అనే ఆడ చనిపోవడం తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్ సమస్యల కారణంగా ఆడ చిరుత షాషా మృతి చెందింది. తాజాగా చనిపోయిన ఉదయ్ అనే చిరుత మరణానికి కచ్చితమైన కారణం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత వెల్లడిస్తామని కునో నేషనల్ పార్క్ లోని సంరక్షకుడు చెబుతున్నారు. 

తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17, 2022న , మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ కు 8 చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. నమీబియా నుంచి మొత్తం 8 చిరుతలను భారత్ కు తీసుకురాగా, అందులో 3 ఆడ చిరుతలు ఉన్నాయి. వీటన్నింటిని కునో నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు.  తొలి దశలో తీసుకొచ్చిన వాటిలో షాషా అనే ఆడ చిరుత ఈ మార్చి నెలలో చనిపోయింది. 

కాగా, నమీబియా నుండి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కుకు తరలించిన చిరుతలలో ఒకటైన 'సియాయా' మార్చి 29న నాలుగు ఆరోగ్యవంతమైన చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  'ప్రాజెక్ట్ చిరుత'లో భాగంగా చిరుతలను దేశానికి తీసుకొచ్చారు. కాగా, దేశంలోని చివరి చిరుత 1947లో ఛత్తీస్ గఢ్ లోని కొరియా ఏరియాలో చనిపోయింది. చిరుతలు దేశంలో అంతరించిపోయాయని 1952లో అధికారికంగా ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget