అన్వేషించండి

Low Rainfall: దేశంలో 2002 నాటి పరిస్థితులు, వచ్చే రెండు వారాలే కీలకమంటున్న వాతావరణ శాఖ

Low Rainfall: భారతదేశంలో భూములు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో భూములు తేమ శాతాన్ని కోల్పోతున్నాయి. దేశంలోని భూ భాగంలో దాదాపు 31% భూమి నీరు లేక మెట్టభూమిగా మారుతోంది.


Low Rainfall: భారతదేశంలో భూములు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో భూములు తేమ శాతాన్ని కోల్పోతున్నాయి. దేశంలోని భూ భాగంలో దాదాపు 31% భూమి నీరు లేక మెట్టభూమిగా మారుతోంది. జూలై 27-ఆగస్టు 23 కాలానికి సంబంధించిన మెట్ డిపార్ట్‌మెంట్ ప్రామాణిక అవపాత సూచిక (SPI) డేటా ఈ వివరాలు వెల్లడించింది. ఇది వ్యవసాయం, పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది.  ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) నిపుణుల బృందం ఈ SPI అనే కొలతను రూపొందించింది.

ఇది వివిధ సమయ ప్రమాణాలలో వాతావరణంలో మార్పులు, వర్షాపాతం లోటు వివరాలను తెలియచేస్తుంది. దేశంలో చాలా చోట్ల గత నెల రోజులుగా రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. దేశంలో 31 శాతం భూభాగం పొడిబారుతోంది. మరో 9 శాతం తీవ్రంగా పొడిగా ఉంది. అదనంగా 4 శాతం విపరీతమైన నీటి ఎద్దడిని అనుభవిస్తున్నట్లు డేటా తెలిపింది.

దక్షిణ భారతంలో చాలా ప్రాంతాలు, మహారాష్ట్ర, గుజరాత్‌లోని పలు జిల్లాలు, తూర్పు భారతదేశంలోని కొన్ని విభాగాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల భూమిలో తేమ శాతం గణనీయంగా తగ్గుతోంది. SPI డేటా మేరకు చాలా వరకు భూములు పొడిబారుతున్నాయి. భారతదేశంలో 47% ప్రాంతం భూమి తేలికపాటి పొడి పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫలితంగా నేల తేమ తగ్గడానికి దారితీస్తాయని, ఇది పంట పెరుగుదల, వ్యవసాయ దిగుబడులపై ప్రభావితం చూపుతుందని నిపుణులు తెలిపారు. 

రాబోయే 2 వారాలు చాలా కీలకం
భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘దేశంలో చాలా వరకు భూభాగం చాలా వరకు నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. రానున్న రెండు వారాలు కీలకం. వర్షాలు కురిస్తే దీని ప్రభావం తగ్గే అవకాశం ఉంది. వానలు కురవకపోతే నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉంది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 23 వరకు సీజనల్‌ ఎస్‌పీఐ నివేదికలో కూడా చాలా జిల్లాలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి 2002ను తలపిస్తోంది. జూలైలో రుతు పవనాలు 26 రోజులు బలహీనంగా ఉన్నాయి. ఫలితంగా వర్షాలు అనుకున్నంత స్థాయిలో కురవలేదు. 

తగినంత నీటి లభ్యత లేకపోవడంతో పంటలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు సరస్సులు, జలాశయాలు, భూగర్భ జలాల స్థాయిలు పడిపోయే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా సరస్సులు, జలాశయాలు నీరు ఎక్కవగా బాష్పీభవనం  అవుతోంది. అయితే, సెప్టెంబరులో వర్షాలు కురిస్తే ఈ వర్షాభావాన్ని కొంత వరకైనా పూడ్చే అవకాశం ఉంది. 

ఎల్ నినో ఈ నెలలో బలంగా ఉండడంతో ఆగస్టులో రుతుపవనాలపై దాని ప్రభావం పడిందని నివేదికలు తెలిపాయి. భవిష్యత్తులో నీటి ఎద్దడిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తులు చేస్తున్నాం. త్వరలో హిందూ మహాసముద్రం ద్విధ్రువ (IOD) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అయితే అది కూడా రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ ఐఓడీ ఏర్పడుతుందని సానుకూలంగా ఉన్నాం.’ అని వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget