అన్వేషించండి

India-Canada Row: బంధాలు మెరుగుపరిచేందుకే భారత్ కు వచ్చాను- కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్

India-Canada Row: బంధాలు మెరుగుపరిచేందుకే దిల్లీకి వచ్చానని కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్‌ జనరల్‌ పీటర్‌ స్కాట్‌ అన్నారు.

భారత్‌, కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ పీటర్‌ స్కాట్‌  దిల్లీలో జరుగుతున్న 'ఇండో-పసిఫిక్‌ ఆర్మీ చీఫ్స్‌ కాన్ఫరెన్స్‌'కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు. రెండు దేశాలు ఈ అంశంపై దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నాయని అన్నారు. అధికారులు, దేశాధినేతలు ఈ సమస్యపై చర్చించి పరిష్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. నిజ్జర్‌ హత్య ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా పీటర్‌ పై విధంగా స్పందించారు.

'నేను ఇరు దేశాల బంధాలను మెరుగుపరిచేందుకు ఇక్కడికి వచ్చాను. భారత ఆర్మీ చీఫ్‌తో జరిపిన సంభాషణలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశాను. ఇది రెండు దేశాల ఆర్మీలకు సంబంధించిన విషయం కాదు. భారత, కెనడా ఆర్మీలు కలిసి పనిచేసే అవకాశం గురించి ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత వివాదాన్ని రెండు దేశాల నాయకులు పరిష్కరించుకుంటారు. ఆర్మీకి సంబంధించిన విషయం కాదని ఇద్దరం అంగీకరించాం. మేము కేవలం ఆర్మీ పరస్పర సహకారం పెంచడం గురించి మాట్లాడుకున్నాం' అని పీటర్‌ స్కాట్‌ ఏబీపీ న్యూస్‌తో వెల్లడించారు. మేజర్‌ జనరల్‌ స్కాట్‌ మంగళవారం తొలుత భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండేతో సమావేశమై మాట్లాడారు.

రెండు దేశాల ఆర్మీ-టు-ఆర్మీ లెవల్‌ బంధాలను మెరుగుపరిచేందుకు తాను దిల్లీకి వచ్చినట్లు స్కాట్‌ వెల్లడించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌, కెనడాల మధ్య ఇంకా మంచి పరస్పర సహకారం ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 'పార్లమెంటులో మా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ప్రకటన గురించి నాకు తెలుసు. కేసు దర్యాప్తులో భారత్‌ సహకరించాలని ఆయన కోరారు. కానీ ఇండో పసిఫిక్‌ సదస్సులో దాని ప్రభావం ఏమీ ఉండదు. మేము కేవలం సైన్యాల మధ్య సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఇక్కడికి వచ్చాము. రెండు దేశాల ప్రభుత్వాలు ఆ సమస్యను పరిష్కరించుకుంటాయి' అని స్కాట్‌ ఏబీపీ న్యూస్ తో తెలిపారు.

భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకంటే..?

ఈ ఏడాది జూన్‌లో కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా, భారత్‌ల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారతీయ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని తమకు విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ ఆరోపించారు. దీనిపై భారత్‌ మండిపడింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని భారత్‌ ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు రాయబారులను బహిష్కరించాయి. కెనడా పౌరులకు వీసాల జారీని కూడా భారత ప్రభుత్వం నిలిపేసింది. కెనడా ఇప్పటికీ ప్రభుత్వం తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget