అన్వేషించండి

𝐓𝐚𝐦𝐚𝐧𝐧𝐚𝐚𝐡 𝐁𝐡𝐚𝐭𝐢𝐚 : తమన్నా చేసిన స్కామేంటి ? ఇంత జరిగినా బయటకు రాలేదా ?

𝐇𝐏𝐙 𝐓𝐨𝐤𝐞𝐧 : హీరోయిన్ తమన్నా భాటియా ఈడీ అధికారుల ముందు హాజరవడం సంచలనం రేపింది. చాలా మంది అసలు కేసేంటి అని ఆరా తీశారు. ఆ పూర్తి వివరాలు ఇవి.

𝐓𝐚𝐦𝐚𝐧𝐧𝐚𝐚𝐡 𝐁𝐡𝐚𝐭𝐢𝐚  𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐇𝐏𝐙 𝐓𝐨𝐤𝐞𝐧 𝐒𝐜𝐚𝐦 : హెచ్‌పీజడ్ క్రిప్టో కరెన్సీ పేరుతో మల్టీ క్రోర్ స్కాం జరిగినప్పుడు దేశంలో సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున లాభాలు వస్తాయని..బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తామని ప్రచారం చేసుకున్న HPZ టోకెన్ అనే సంస్థ మోసాలకు పాల్పడింది. ఈ సంస్థపై మొదట నాగాలాండ్ లో కేసు నమోదు అయింది. హెచ్‌పీజడ్ టోకెన్ సంస్థ ప్రత్యేక యాప్ ను సిద్ధం చేసి అసలు లేని క్రిప్టో కరెన్సీ మైనింగ్ మెషిన్స్ మీద పెట్టుబడి పెట్టాలని ప్రజల్ని నమ్మించింది. ఈ సంస్థ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 

ఈ కేసులోనే తమన్నా భాటియాను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. అయితే తమన్నా ఈ స్కాంలో నేరుగా ఎక్కడా పాల్గొనలేద.కానీ హెచ్‌పీజడ్ సంస్థ నుంచి ఆమెకు కొన్ని పేమెంట్స్ అందాయి. ఆ పేమెంట్స్ కేవలం ఆ సంస్థ నిర్వహిచిన ఈవెంట్స్ పాల్గొనేందుకు చేసినవి. ఈ అంశంపై ప్రశ్నించేందుకే ఈడీ ఆమెను పిలిపిచింది. ఈ యాప్ విషయంపై తమన్నాపై ఎలాంటి ఆరోపణలు కానీ..మనీలాండరింగ్ చేసినట్లుగా కేసులు కానీ లేవు. అదే సమయంలో ఈ యాప్ విషయంలో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్లుగా కూడా ఎక్కడా ఈడీ చెప్పలేదు. ఓ ఈవెంట్ కు హాజరవడం వల్ల ఆమెకు అందిన డబ్బు విషయంలో మాత్రమే ప్రశ్నించేందుకు పిలిపించారు.  

మూడేళ్ల కిందట ఈ కంపెనీపై మొదటి సారి నాగాలాండ్ లోని కోహిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అవడానికి నాగాలాండ్ కేంద్రమే అయినా హైదరాబాద్‌లోనూ లింకులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్న మూడు చైనీస్ కంపెనీలకు ఈ యాప్ తో సంబంధాలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీ హైదరాబాద్ లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజిస్టర్ అయ్యాయి. యాప్ ద్వారా సేకరిస్తున్న నగదును  ఈ మూడు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారు. 
 
క్రిప్టో కరెన్సీని మైనింగ్ చేయాలంటే పెద్ద పెద్ద యంత్రాలు కావాలని ఆ యంత్రాల కోసం పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజల్ని పిచ్చోళ్లను చేశారుఈ యాప్ నిర్వహకులు. అయితే ఇలాంటి యంత్రాలు ఉంటాయని.. వాటిని కొంటామని కూడా ఎక్కడా ఆ కంపెనీ ఎవరికీ చెప్పలేదు. అలాంటి పనులు కూడా చేయలేదు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి నిధులు సేకరించి దారి మళ్లించారు. ఈ కేసులో ఈడీ పూర్తి విచారణ జరిపి 76 చైనా సంస్థలకు సంబంధం ఉందని.. 299 మంది వ్యక్తులు ఈ స్కాంలో పాలు పంచుకున్నారని గుర్తించారు. వీరిలో చైనీస్ నేషనల్స్ దేశం పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే చాలా మంది దేశం దాటి పోయారన్న ఆరోపణలు ఉన్నాయి.                

అంటే ఈ యాప్ మంచిదని తమన్నా ప్రచారం చేసి డబ్బులు తీసుకున్నారు. అదొక్కటే ఆమెను ఈడీ విచారణ వరకూ తీసుకొచ్చింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget