అన్వేషించండి

𝐓𝐚𝐦𝐚𝐧𝐧𝐚𝐚𝐡 𝐁𝐡𝐚𝐭𝐢𝐚 : తమన్నా చేసిన స్కామేంటి ? ఇంత జరిగినా బయటకు రాలేదా ?

𝐇𝐏𝐙 𝐓𝐨𝐤𝐞𝐧 : హీరోయిన్ తమన్నా భాటియా ఈడీ అధికారుల ముందు హాజరవడం సంచలనం రేపింది. చాలా మంది అసలు కేసేంటి అని ఆరా తీశారు. ఆ పూర్తి వివరాలు ఇవి.

𝐓𝐚𝐦𝐚𝐧𝐧𝐚𝐚𝐡 𝐁𝐡𝐚𝐭𝐢𝐚  𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐇𝐏𝐙 𝐓𝐨𝐤𝐞𝐧 𝐒𝐜𝐚𝐦 : హెచ్‌పీజడ్ క్రిప్టో కరెన్సీ పేరుతో మల్టీ క్రోర్ స్కాం జరిగినప్పుడు దేశంలో సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున లాభాలు వస్తాయని..బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తామని ప్రచారం చేసుకున్న HPZ టోకెన్ అనే సంస్థ మోసాలకు పాల్పడింది. ఈ సంస్థపై మొదట నాగాలాండ్ లో కేసు నమోదు అయింది. హెచ్‌పీజడ్ టోకెన్ సంస్థ ప్రత్యేక యాప్ ను సిద్ధం చేసి అసలు లేని క్రిప్టో కరెన్సీ మైనింగ్ మెషిన్స్ మీద పెట్టుబడి పెట్టాలని ప్రజల్ని నమ్మించింది. ఈ సంస్థ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 

ఈ కేసులోనే తమన్నా భాటియాను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. అయితే తమన్నా ఈ స్కాంలో నేరుగా ఎక్కడా పాల్గొనలేద.కానీ హెచ్‌పీజడ్ సంస్థ నుంచి ఆమెకు కొన్ని పేమెంట్స్ అందాయి. ఆ పేమెంట్స్ కేవలం ఆ సంస్థ నిర్వహిచిన ఈవెంట్స్ పాల్గొనేందుకు చేసినవి. ఈ అంశంపై ప్రశ్నించేందుకే ఈడీ ఆమెను పిలిపిచింది. ఈ యాప్ విషయంపై తమన్నాపై ఎలాంటి ఆరోపణలు కానీ..మనీలాండరింగ్ చేసినట్లుగా కేసులు కానీ లేవు. అదే సమయంలో ఈ యాప్ విషయంలో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్లుగా కూడా ఎక్కడా ఈడీ చెప్పలేదు. ఓ ఈవెంట్ కు హాజరవడం వల్ల ఆమెకు అందిన డబ్బు విషయంలో మాత్రమే ప్రశ్నించేందుకు పిలిపించారు.  

మూడేళ్ల కిందట ఈ కంపెనీపై మొదటి సారి నాగాలాండ్ లోని కోహిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అవడానికి నాగాలాండ్ కేంద్రమే అయినా హైదరాబాద్‌లోనూ లింకులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్న మూడు చైనీస్ కంపెనీలకు ఈ యాప్ తో సంబంధాలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీ హైదరాబాద్ లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజిస్టర్ అయ్యాయి. యాప్ ద్వారా సేకరిస్తున్న నగదును  ఈ మూడు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారు. 
 
క్రిప్టో కరెన్సీని మైనింగ్ చేయాలంటే పెద్ద పెద్ద యంత్రాలు కావాలని ఆ యంత్రాల కోసం పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజల్ని పిచ్చోళ్లను చేశారుఈ యాప్ నిర్వహకులు. అయితే ఇలాంటి యంత్రాలు ఉంటాయని.. వాటిని కొంటామని కూడా ఎక్కడా ఆ కంపెనీ ఎవరికీ చెప్పలేదు. అలాంటి పనులు కూడా చేయలేదు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి నిధులు సేకరించి దారి మళ్లించారు. ఈ కేసులో ఈడీ పూర్తి విచారణ జరిపి 76 చైనా సంస్థలకు సంబంధం ఉందని.. 299 మంది వ్యక్తులు ఈ స్కాంలో పాలు పంచుకున్నారని గుర్తించారు. వీరిలో చైనీస్ నేషనల్స్ దేశం పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే చాలా మంది దేశం దాటి పోయారన్న ఆరోపణలు ఉన్నాయి.                

అంటే ఈ యాప్ మంచిదని తమన్నా ప్రచారం చేసి డబ్బులు తీసుకున్నారు. అదొక్కటే ఆమెను ఈడీ విచారణ వరకూ తీసుకొచ్చింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
Embed widget