అన్వేషించండి

Delhi Rains: నీళ్లు లేవు, కరెంటూ లేదు - భారీ వర్షాలతో ఢిల్లీవాసుల అవస్థలు - ఆరుగురు మృతి

Delhi Floods: ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Rains in Delhi: మొన్నటి వరకూ ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు వరదలతో నానా పాట్లు పడుతున్నారు. భారీ వర్షాలతో దేశ రాజధాని తడిసి ముద్దైపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లన్నీ నీట మునిగాయి. 88 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొదట్లోనే ఇలా ఉంటే రానురాను మరింత భారీ వర్షాలు కురుస్తాయేమోనన్న ఆందోళన పెరుగుతోంది. వచ్చే ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉంటుందని IMD స్పష్టం చేసింది. జులై 1వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేవలం 24 గంటల్లోనే 228.1 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఫలితంగా అన్ని ప్రాంతాలూ నీట మునిగాయి. ఇప్పటి వరకూ ఈ వరదల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు చిన్నారులు కాలువలో పడి కొట్టుకుపోయారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఇప్పటికే IMD వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢిల్లీ NCR, ద్వారకా, పాలం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గుడ్‌గావ్, మనేసర్, ఫరిదాబాద్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. 

ఉస్మాన్‌పూర్‌లో ఇంటి ముందు ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ గుంటలో పడి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వసంత్ విహార్‌లో భారీ వర్షాలకు ఓ భవనం కూలిపోయింది. ఆ శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది వచ్చి వాళ్లను సురక్షితంగా బయటకు తీశారు. వరదలకు తోడు విద్యుత్ కోతలూ ఇబ్బంది పెడుతున్నాయి. నీటి సరఫరా కూడా ఆగిపోయింది. ఇటు కరెంట్ లేక అటు తాగడానికి నీళ్లూ లేక ఢిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో టర్మినల్ 1 కుప్ప కూలిన ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతానికి ఆ టర్మినల్‌ని మూసివేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Bail News: బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
EXCLUSIVE: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Bail News: బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
EXCLUSIVE: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
జనసేన ఎమ్మెల్యేలకు రెండు కొత్త పదవులు - చంద్రబాబుకు పవన్ లేఖ
Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
New Criminal Laws: కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
Embed widget