By: Ram Manohar | Updated at : 25 Mar 2023 12:45 PM (IST)
సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Delhi Excise Policy Case:
ఏప్రిల్ 5న విచారణ..
ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా లిక్కర్ స్కామ్లో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ అధికారులు రోజూ గంటల పాటు ఆయనను విచారిస్తున్నారు. అటు కోర్టు కూడా ఆయన కస్టడీ గడువును పెంచుతూ పోతోంది. కీలక వివరాలు సిసోడియా చెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. సిసోడియా మాత్రం తాను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నట్టు వివరిస్తున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దీనిపై విచారణ జరగలేదు. కస్టడీని పొడిగిస్తోందే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. ఇవాళ ఈ పిటిషన్పై విచారించాల్సి ఉన్నా...ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 5వ తేదీన విచారిస్తామని వెల్లడించింది. స్పెషల్ జడ్జ్ నాగ్పాల్ ఈ విచారణను వాయిదా వేశారు. దీనిపై ఈడీ వివరణ ఇచ్చిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సేకరించేందుకు మరి కొంత సమయం కావాలని తెలిపారు. ఓ వైపు విచారణ పూర్తికాకుండానే..సిసోడియాకు బెయిల్ ఇవ్వడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ కీలక సమయంలో బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశముందని సీబీఐ అధికారులు వాదించే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన మొబైల్ ఫోన్లు ధ్వంసం చేయడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Excise policy case | The Rouse Avenue Court fixed April 5 for hearing on the bail plea of Delhi's former Deputy CM Manish Sisodia.
— ANI (@ANI) March 25, 2023
ఈ నెల 22న ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 5వ తేదీ వరకూ కస్టడీలోనే ఉండాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో మనీశ్ సిసోడియా అభ్యర్థననూ పరిగణనలోకి తీసుకుంది. కస్టడీలోకి ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని సిసోడియా కోరారు. దీనిపై అప్లికేషన్ పెట్టుకోవాలని కోర్టు వెల్లడించింది. ఇప్పటికే సిసోడియా బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఇంకా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ పిటిషన్పై ఈడీ వివరణను కోరింది కోర్టు. స్పెషల్ జడ్జ్ ఎమ్కే నాగ్పాల్ ఈ విషయమై ఈడీకి నోటీసులు ఇచ్చారు. మార్చి 25లోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. మార్చి 17న రౌజ్ అవెన్యూ కోర్టు సిసోడియా కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించింది. అది నేటితో ముగిసింది. ఈ మేరకు మరోసారి ఆయనను కోర్టులో హాజరు పరిచింది ఈడీ. మళ్లీ విచారించిన కోర్టు...ఏప్రిల్ 5 వరకూ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి నాటి డాక్యుమెంట్ల ఆధారంగా చూస్తే ఈ పాలసీలో సిసోడియాకు 5% కమీషన్ ఉన్నట్టు చెబుతోంది ఈడీ. అయితే 2022 సెప్టెంబర్ నాటికి అది 12%కి పెరిగిందని వివరించింది. సిసోడియా తరపు న్యాయవాది మాత్రం దర్యాప్తు సంస్థలు చెప్పిందే చెబుతున్నాయి తప్ప కొత్త ఆధారాలేవీ వెలుగులోకి తీసుకురావడం లేదని వాదిస్తున్నారు.
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్పీఎస్సీ వివరణ
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
/body>