అన్వేషించండి

Coronavirus India Update: దేశంలో కొత్తగా 43,654 కేసులు, 640 మరణాలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ 40 వేలు దాటాయి. క్రితం రోజు కాస్త తగ్గిన కేసులు ఈ రోజు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. మంగళవారం 17,36,857 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి వైరస్‌ సోకింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 47 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 3.14 కోట్ల కేసులు వెలుగుచూడగా.. 4,22,022 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. 

ఇక నిన్న 41,678 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోసారి రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీలు 3.06 కోట్లకు చేరాయి. ఇక రికవరీరేటు 97.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 3,99,439 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీలరేటు 1.27 శాతంగా ఉంది. మరోవైపు నిన్న 40,02,358 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 44,61,56,659కి చేరింది.

మూడో వేవ్ పై అంచనాలు..

దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 40వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.

భారత్‌లో ఇప్పటికే మూడింట రెండు వంతుల జనాభాలో యాంటీబాడీలు ఉన్నాయని సీరమ్ సర్వేలో వెల్లడైన విషయంపై డా.గులేరియా స్పందించారు. ఇప్పటికీ ఒక వంతు జనాభా వైరస్ రిస్క్‌ను ఎదుర్కొంటోందన్న విషయాన్ని ప్రస్తావించారు. యాంటీబాడీలకు సంబంధించి రెండు అంశాలను పేర్కొన్నారు. ఒకటి... శరీరంలో 'X' స్థాయిలో యాంటీబాడీలు ఉంటే రీఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటారని చెప్పేందుకు ఎటువంటి అవకాశం లేదన్నారు. రెండవది... వైరస్ బారినపడి కోలుకున్నవారిలో క్రమంగా యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతుందన్నారు. అయితే వ్యాక్సినేషన్ పెరగడం మంచి పరిణామని... థర్డ్ వేవ్ మరీ అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని అన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాచించకుండా లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు లైట్ తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ ప్రమాదకరంగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. కనుక ప్రజలు నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Telangana Latest News: మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
BRS MLC Kavitha : ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

People Digging Asirgarh Fort Chhaava Viral Video | సినిమాలో చూపించినట్లు గుప్త నిధులున్నాయనే ఆశతో | ABP DesamNTR Fan Koushik Passed Away | ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆకస్మిక మృతి | ABP DesamYS Viveka Case Witness Deaths | ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ? | ABP DesamRashmika Karnataka Government Controversy | రష్మికపై ఫైర్ అవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Telangana Latest News: మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
BRS MLC Kavitha : ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
ఓటీటీ కంటెంట్‌, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
Borugadda Anil: నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో
నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో
Nani: ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
Viral Video: ఆ అమ్మాయి మీద పగబట్టిన కుక్కలు - గ్యాంగ్ ఎటాక్ -  ఈ వీడియో చూస్తే భయపడిపోతారు!
ఆ అమ్మాయి మీద పగబట్టిన కుక్కలు - గ్యాంగ్ ఎటాక్ - ఈ వీడియో చూస్తే భయపడిపోతారు!
Telangana News: 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 18 ఏళ్ల లోపు బాలికలతో సంఘాలు- తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన
60 ఏళ్లు దాటిన వృద్ధులు, 18 ఏళ్లలోపు బాలికలతో సంఘాలు- తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన
Embed widget