![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు
Chittoor District News: చిత్తూరు జిల్లా పలమనేరు రోడ్డుపై దాదాపు 22 ఏనుగులు హల్చల్ చేశాయి. దీంతో గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
![Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు Chittoor District News Elephants Hulchul in Palamaneru Andhra Pradesh Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/2f8a86bc623b7e610d1dc8bce38f05981670310376872519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Elephants in Palamaneru: చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగు గ్రామ సమీపంలో గుడియాత్తం రోడ్డుపై ఏనుగుల గుంపు మకాం వేసింది. మొత్తం 22 ఏనుగులు.. రోడ్డు పక్కనున్న సోలార్ కంచెను విరగొట్టి రోడ్డుపైకి వచ్చేశాయి. దీంతో అటు అడవిలోకి వెళ్లలేక అటు ఇటూ తిరుగుతూ రోడ్డుపై ఉండిపోయాయి. గజరాజులు రోడ్డుపై మకాం వేయడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించాయి. అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి తరమడానికి కృషి చేస్తున్నారు. ఏనుగులు ఎక్కడ తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తాయోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయం భయంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు.
పదిరోజుల క్రితం కూడా 15 ఏనుగుల గుంపు హల్ చల్..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కడతట్ల పల్లి గ్రామ సమీపంలోని బోడెనేగట్టు వద్ద గల పంట పొలాల్లో ఓ ఏనుగుల గుంపు సంచరించింది. మొత్తం 15 ఏనుగులు సమీలా, రాజేష్ పంట పొలాన్ని తొక్కి నాశనం చేశాయి. గురువారం రోజు వేకువజామున ఏనుగులు వీరంగం సృష్టించాయి. మొత్తం ఐదు కొబ్బరి చెట్లు, ఒక ఎకరా వరి పంట పొలాన్ని తొక్కిసలాటలో పూర్తిగా ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు పాడు చేయడం బాధాకరం అంటున్నారు. అటవీ శాఖ అధికారులు ఎన్ని అడ్డుకట్టులు వేసినప్పటికీ... గజరాజుల దాడులు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. నష్టపోయిన రైతన్నలకు నష్ట పరిహారం అందించిన పాపాన కూడా పొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం వాటిల్లినప్పుడు వస్తున్న అధికారులు... సంఘటనా స్థలంలో సాయం చేస్తామని హామీలు ఇవ్వడం ఆ తర్వాత కనిపించకుండా పోవడం పరిపాటిగా మారిందంటూ అటవీ సరిహద్దు ప్రాంతాల రైతన్నలు వాపోతున్నారు.
గజరాజుల దాడిలో నష్టపోయిన రైతన్నలు కార్యాలయాల చుట్టు తిరిగి కాళ్లు అరిగాయే తప్ప... ప్రభుత్వ నుంచి పైసా కూడా అందలేదని రైతన్నలు మొర పెట్టుకుంటున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల శివారున ఏనుగులు కనీసం నెలలో మూడు సార్లు దర్శనం ఇస్తున్నాయి. ఏనుగుల నుండి తమ పంట పొలాలకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
మన్యం జిల్లాలో ఏనుగుల మంద బీభత్సం...
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో నెల రోజుల క్రితం ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. గంగులువాని చెరువు దగ్గర ఉన్న 2 ఆవులను, ఒక లేగ దూడను ఏనుగులు తొక్కి చంపాయి. మరోవైపు మిర్తివలసలోనూ ఆవుల మందపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే భయబాంత్రులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. గత నాలుగు ఏళ్లుగా మన్యం వాసులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఏనుగుల దాడిలో వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని, మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)