అన్వేషించండి

BS Yediyurappa Resigns: కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా

కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా చేశారు. అందరూ ఊహించినట్లుగానే తన రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేశారు. మధ్యహ్నం లంచ్ తర్వాత ఆయన గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.

" ప్రధాని మోదీ, అమిత్ షా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను గెలవాలి. భారత్.. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా ఎదగాలి. నేను సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంగా మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు. "
-    యడియూరప్ప

నడ్డా కీలక వ్యాఖ్యలు..

యడియూరప్ప రాజీనామాపై భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి యడియూరప్ప తనదైన శైలిలో బాగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. గోవాలో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న నడ్డా ఆదివారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోనే భాజపా బరిలో దిగుతుందని నడ్డా పేర్కొన్నారు. దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని నడ్డా ఎద్దేవా చేశారు.

ఆటుపోట్ల సర్కార్..

 సమన్వయం లేని జనతాదళ్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు కూలిన వెంటనే మొదలైన యడియూరప్ప భాజపా సర్కారు రెండేళ్లుగా ఆటుపోట్లతో ఊగిసలాడుతోంది. 2019 జులై 26న ముఖ్యమంత్రిగా బి.ఎస్‌.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారంతో ఆ సర్కారుకు రెండేళ్లు నిండుతుంది. ఈ రెండేళ్లలో సర్కారు పయనం ఏమంత సజావుగా సాగలేదు. 2008 నుంచి 2013 వరకు ఐదేళ్ల పాటు భాజపా సర్కారు నడిచినా వివిధ కారణాలతో మూడుసార్లు నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చింది. 2018లోనూ అత్యధిక స్థానాలు పొందినా అధికారానికి సరిపడా సంఖ్యాబలం లేక.. కేవలం ఆరు రోజులకే చతికిల పడింది. ఆపై సంకీర్ణ సర్కారు కూలిపోగా 2019 జులై 26న మరోమారు యడియూరప్ప నాయకత్వంలోనే భాజపా సర్కారు ఏర్పాటు కావడం నిన్నటి చరిత్ర. రెండేళ్ల పాటు యడియూరప్ప నేతృత్వంలో సర్కారు బండి నడిచినా లెక్కలేనన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆది నుంచి తడబాటు

సర్కారు ఏర్పాటైన కేవలం పది రోజులకే ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు పలకరించాయి. మహారాష్ట్రలో ఎప్పటిలాగే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర సరిహద్దులోని 10 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. అప్పటికీ మంత్రివర్గాన్నే ఏర్పాటు చేయని యడియూరప్ప తానొక్కడే వరద ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 5 నుంచి మూడు రోజుల పాటు బెళగావి, కొడగు, రాయచూరు తదితర జిల్లాలను చుట్టేశారు. ఆప్పటికి రూ.38 వేల కోట్ల వరద నష్టాన్ని అంచనా వేసినా కేంద్ర సర్కారు కేవలం రూ.1,809 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే సర్కారు ఉంటే ఎంతో సానుకూలమని ప్రకటించిన యడియూరప్పకు ఈ పరిహారం పెద్ద ఎదురుదెబ్భ 2020 ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాల కారణంగా 15 జిల్లాల్లో 157 తాలూకాలు నష్టపోయాయి. నాడు కేంద్ర సర్కారు రూ.890 కోట్లు మాత్రమే విడుదల చేయటంతో రాష్ట్ర సర్కారు తీవ్ర నిరాశకు గురైంది.

కరోనాతో కష్టాలు

సర్కారు ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే కరోనా రూపంలో మరో అవాంతరం ఎదురైంది. యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. 2020 ఏప్రిల్‌ నుంచి జులై వరకు విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయం గణనీయంగా తగ్గింది. వైద్య సదుపాయాల కోసం వేల కోట్లను వ్యయం చేసిన సర్కారు కేంద్ర సాయాన్ని కోరినా అడపాదడపా విడుదల చేసింది రూ.950 కోట్లు మాత్రమే. పీఎం కేర్స్‌ నుంచి వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు అందినా.. చాలక పోవటంతో రాష్ట్ర సర్కారు రూ.50వేల కోట్ల అదనపు వ్యయం చేసి.. ఖజానా ఖాళీ చేసుకుంది. రూ.2,500కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రైతులు, వీధి వ్యాపారులకు ప్రత్యేక రుణ సదుపాయం కల్పించిన సర్కారుకు రాబడి కంటే పోబడి మరింత భారంగా మారింది. 2020 ఆగస్టు నుంచి కరోనా కేసులు తగ్గి ఆర్థికంగా పుంజుకున్నా 2021 ఫిబ్రవరి నుంచి రెండో దఫా కరోనా మరిన్ని అవాంతరాలు సృష్టించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Embed widget