అన్వేషించండి

Telugu breaking News: రాజ్‌కోట్‌ టెస్టులో సెంచరీ చేసిన రోహిత్‌

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

Key Events
breaking news February 15th live updates Rajkot test telangana Assemblye budget sessions Andhra Pradesh Assembly cm revanth reddy cm jagan Sharmila chandra babu lokesh Shankharavam ktr harish rao pm narendra modi bjp congress Telugu breaking News: రాజ్‌కోట్‌ టెస్టులో సెంచరీ చేసిన రోహిత్‌
ప్రతీకాత్మక చిత్రం(Image Source- freepik)

Background

వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన వ్యవస్థలలో వాలంటీర్ సిస్టమ్ ఒకటి. వాలంటీర్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ సహా పలు కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తోంది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం తరఫున సేవలు అందిస్తున్న వాలంటీర్లకు వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు నగదు ప్రోత్సహకాలు అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందుకోనున్నారు. 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు.. ఒక్కో వాలంటీర్ కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 1.61 కోట్ల నగదు బహుమతుల ప్రదానం ఇవాళ ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రారంభించనున్నారు. 

వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన..
ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాలంటీర్ల సేవలను గుర్తంచిన ప్రభుత్వం వారికి అందిస్తున్న పురస్కారాల మొత్తాన్ని పెంచింది. గరిష్టంగా సేవా వజ్ర అవార్డుకు ఎంపికైన వారి ఖాతాల్లో రూ.45,000 జమ చేయనున్నారు. సేవా రత్నలో భాగంగా రూ.30000, సేవా మిత్ర అవార్డు గ్రహీతలకు పది వేల నుంచి రూ.15,000కు పెంచారు.

ఇప్పటివరకు అందించింది (రూ.లలో)    పెంచి ఇస్తున్నది (రూ.లలో)
సేవా వజ్ర రూ.30,000 ఇకనుంచి రూ.45,000
సేవా రత్న రూ.20,000  ఇకనుంచి రూ.30,000
సేవా మిత్ర రూ.10,000  ఇకనుంచి రూ.15,000

లంచాలకు, వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో భాగమైనందుకు, పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ, సహాయకారిగా వ్యవహరిస్తున్నందుకు.. తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు.. గ్రామ/వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నందుకు... ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి పింఛన్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నందుకుపెన్షన్లతో పాటు రేషన్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నారు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, 'దిశ' వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు.. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు..
'సేవా వజ్ర'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 45,000 నగదు బహుమతి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం
'సేవా రత్న'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 30,000 నగదు బహుమతి..
ప్రతి మండలం/మున్సిపాలిటీ పరిధిలో 5 మంది చొప్పున, మున్సిపల్  కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు...మొత్తంగా 4,150 మందికి "సేవా రత్న" పురస్కారాల ప్రదానం...
'సేవా మిత్ర'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి..
రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు "సేవామిత్ర" పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

14:37 PM (IST)  •  15 Feb 2024

రోహిత్ శర్మ సెంచరీ

రాజ్‌కోట్‌ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మకు ఇదే అత్యుత్తమ సెంచరీ. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. కానీ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాతో కలిసి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించి టెస్టు కెరీర్ లో 11వ సెంచరీ సాధించాడు.

13:54 PM (IST)  •  15 Feb 2024

రోహిత్-జడేజాల బలమైన భాగస్వామ్యం

46 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 53 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 127 పరుగుల భాగస్వామ్యం ఉంది. రోహిత్, జడేజా కారణంగా ఇంగ్లండ్ ఇప్పుడు వెనుకంజలో ఉంది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget