By: ABP Desam | Updated at : 27 Sep 2022 10:33 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
PFI Raids: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యులు, కార్యాలయాలపై.. కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి.
ఈ రాష్ట్రాల్లో
ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS), స్థానిక పోలీసులు కూడా పాల్గొంటున్నారు. పీఎఫ్ఐకి సంబంధించిన 25 ప్రదేశాలలో తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు ABP న్యూస్కు సమాచారం అందింది.
రెండు వారాల్లో మూడోసారి దేశంలో పీఎఫ్ఐ కార్యకలాపాలపై.. ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 ప్రాంతాల్లో ఫెడరల్ యాంటీ టెర్రర్ ఏజెన్సీ దాడులు నిర్వహించిన కొద్ది రోజులకే మళ్లీ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఎన్ఐఏ తాజా దాడులు గతంలో జరిగిన రైడ్, దర్యాప్తు ఆధారంగా సాగుతున్నట్లు సమాచారం.
అరెస్ట్
కర్ణాటకలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మహారాష్ట్రలోనూ పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ జరిగింది
మొత్తం 11 రాష్ట్రాల్లోని PFI (Popular Front of India) ఆఫీసుల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు ఇటీవల రెయిడ్స్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. ఈ 106 మందిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, ఆంధ్రప్రదేశ్ ఐదుగురు, అసోంలో 9 మంది, దిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్లో నలుగురు, పుదుచ్చేరిలో ముగ్గురు, తమిళనాడులో 10 మంది, యూపీలో 8 మందితో పాటు రాజస్థాన్లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పకడ్బందీగా భారీ సోదాలు చేపట్టాయి NIA,ED. ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న వారి ఇళ్లలో ఈ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంప్లూ నిర్వహించారు. ఇంకొందరు యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని NIA అధికారులు చెబుతున్నారు.
యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్ఐ చట్టవిరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో నేడు ఎన్ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది.
Also Read: Viral Video: పాప బ్యాగ్లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!
TS Budget 2023-24: తెలంగాణలో అభివృద్ధి అందుకే సాధ్యమైంది, వాటికన్నా ముందున్నాం - బడ్జెట్ ప్రసంగంలో హరీశ్
Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్: శాఖలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఇవీ, దీనికి అత్యధికంగా నిధులు
LIC ADO Recruitment: 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!
MLA Poaching Case: తెలంగాణ సర్కార్కు ఝలక్! ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు, సింగిల్ బెంచ్ నిర్ణయాన్నే సమర్థించిన డివిజన్ బెంచ్
Jr NTR On Fans : ఎన్టీఆర్ కోపానికి కారణం ఏమిటి? తమిళ హీరోలను చూసి నేర్చుకోవాలా?
Revanth Reddy: పాదయాత్రకు బయల్దేరిన రేవంత్, వీర తిలకం దిద్ది సాగనంపిన కుమార్తె
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి
Ravindra Jadeja: 6 నెలల తర్వాత భారత్ తరఫున ఆడనున్న జడేజా- ప్రాక్టీస్ వీడియో చూశారా!