అన్వేషించండి

Assam-Mizoram Border Dispute: రణరంగంలా అస్సాం-మిజోరం సరిహద్దు....అస్సాం సీఎంపై మిజోరంలో కేసు... నాగాలాండ్ తో ఒప్పందం

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. శనివారం మరోసారి సరిహద్దు ప్రాంతం రణరంగంలా మారింది. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు వివాదాలకు తెరదించేందుకు అస్సాం ప్రయత్నాలు చేస్తుంది.

అస్సాం-మిజోరం సరిహద్దులో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో శనివారం పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఏ క్షణంలో ఏంజరుగుతుందో అన్న ఆందోళనలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు విషయమై ఉన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా అస్సాం చర్యలు ప్రారభించింది. ఈ మేరకు అస్సాం- నాగాలాండ్‌ సరిహద్దులో నెలకొన్న వివాదం పరిష్కారానికి ఇరు ప్రభుత్వాలు శనివారం ఒక ఒప్పందానికి వచ్చాయి. వివాదాస్పద ప్రాంతాల్లోని రెండు రాష్ట్రాల సాయుధ పోలీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి, శిబిరాలకు తరలించాలని నిర్ణయించాయి. ఒప్పందం ప్రకారం దెస్సొయ్‌ లోయ అభయారణ్యంలోని వివాదాస్పద స్థలాల్లోని సాయుధ పోలీసులను 24 గంటల్లో పూర్తిగా ఉపసంహరించుకుంటారు. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్‌ల ద్వారా, ఉపగ్రహ ఛాయా చిత్రాలతో యథాతథస్థితిని కొనసాగించేందుకు కృషి చేస్తాయి. ఈ ఒప్పందంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తంచేశారు. నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నైఫియు రియోకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.


మిజోరం రాష్ట్రంలో తనపై కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై అస్సాం సీఎం బిశ్వశర్మ స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అదే సమయంలో రాజ్యాంగ పరంగా మిజోరం భూభాగంలో జరిగిన ఘర్షణపై విచారణను తటస్థ సంస్థకు ఎందుకు అప్పజెప్పడం లేదని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగాకు తెలిపానని అన్నారు. ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందిన ఘటనకు సంబంధించి.. మిజోరంలోని కొలాసిబ్‌ అధికారులు ఆరుగురిపై అస్సాంలోని కచార్‌ జిల్లా అధికారులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

వాహన రాకపోకలు బంద్ 

జులై 26వ తేదీన సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకున్న రోజు నుంచి అస్సాం నుంచి ఒక్క ట్రక్కు కూడా రాష్ట్రంలోకి రాలేదని మిజోరం అధికారులు తెలిపారు. మిజోరంలో ముఖ్యమైన 306వ నెంబర్ జాతీయ రహదారిపై అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో దిగ్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సోమవారం నుంచి శనివారం వరకు అస్సాం నుంచి మిజోరం రాష్ట్రానికి ఒక్క వాహనం కూడా రాలేదని కొలాసిబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హెచ్‌ లాల్తాంగ్లియానా ఉద్ఘాటించారు. అస్సాం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. 

అసలు వివాదం ఏంటి?

19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు ఈశాన్య ప్రాంతం ఆక్రమణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల ఆధ్వర్యంలో ఉండే భూభాగాలను ఆక్రమించుకోడానికి అక్కడి ప్రాంతాల పరిపాలనకు అస్సాంను కేంద్రంగా చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈశాన్య ప్రాంతాలు అస్సాంలో భాగంగానే ఉండేవి. అనంతరం నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అస్సాం నుంచి విడిపోయాయి. అయితే సరిహద్దుల విభజన మాత్రం అప్పట్లో సరిగా జరగలేదనే వాదన వినిపిస్తునే ఉంది. దీనిపై ఈ నాలుగు కొత్త రాష్ట్రాలు ముందు నుంచి అసంతృప్తితోనే ఉన్నాయి. 

ఈ సరిహద్దు వివాదాలు చినికి చినికి పెద్దవి కావడానికి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులేనని నిపుణులు అంటున్నారు. అస్సాం నుంచి విడిపోయిన నాలుగు రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా సరిహద్దులు నిర్దేశించుకున్నాయి. అయినా చారిత్రకంగా తమ సొంత భూములను కోల్పోయామనే భావన నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ వాసుల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో తమ వనరులు కోల్పోవడానికి సిద్ధంగా లేని రాష్ట్రాలు, సరిహద్ధుల్లోని భూభాగాలపై హక్కులు కోసం ప్రయత్నిస్తునే ఉన్నాయి. 

అస్సాం-మిజోరాం సరిహద్దుల్లో సమస్యలు గతంలో సైతం హింసకు దారితీశాయి. నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న అస్సాం సరిహద్దుల్లో కూడా ఘర్షణలు తలెత్తాయి. ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి గతంలో ఏర్పాటు చేసిన సరిహద్దు కమీషన్ల వల్ల ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. కమీషన్లు ప్రతిపాదించిన సిఫార్సులను ఆయా రాష్ట్రాలు అంగీకరించడానికి సిద్ధంగాలేవు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget