అన్వేషించండి

Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌ పాతబస్తీలో హై అలర్ట్- భద్రతా బలగాల ఫ్లాగ్‌ మార్చ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌ పాతబస్తీలో హై అలర్ట్- భద్రతా బలగాల ఫ్లాగ్‌ మార్చ్

Background

Breaking News Live Telugu Updates: 

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు చేపట్టింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ దీక్షా కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగానే  గృహ నిర్భంధంలో ఉన్న బండి సంజయ్ కుమార్.. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో ఉన్న తన నివాసంలో ‘‘నిరసన దీక్ష’’ చేయనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే.. దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ ను అక్రమంగా నిర్బంధించారని చెబుతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ వస్తుండటం, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

బీజేపీ నిరసన దీక్ష..

జిల్లా హెడ్ క్వార్టర్స్, మండల కేంద్రాలు, హైదరాబాద్‌లో ఈ నిరసన దీక్షలు చేయనున్నారు. కరీంనగర్ జోత్యి నగర్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్న బండి సంజయ్ అక్కడే నిరసన దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

నిరంకుశ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు..

బండి సంజయ్ గృహ నిర్బంధం..

ప్రజాసంగ్రామ యాత్ర చేస్తూ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలం పామునూరు వద్ద ధర్మ దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. బండి సంజయ్ గృహ నిర్బంధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 

అందుకే గృహ నిర్బంధం..

హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇది అక్రమమంటూ బండి సంజయ్ తన పాదయాత్ర ప్రారంభించే ముందు నల్ల బ్యాడ్జీ ధరించారు. అనంతరం ధర్మ దీక్షకు కూర్చున్నారు. కవిత ఇంటి ముందు బీజేపీ శ్రేణులు నిరసన తెలపడాన్ని వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బండి సంజయ్ పాదయాత్ర వద్దకు వస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సుమారు 300 మంది పోలీసుల బలగాలను మోహరించి బండి సంజయ్ దీక్షను భగ్నం చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కరీంనగర్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

18:08 PM (IST)  •  24 Aug 2022

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత-

కుప్పంలో చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు రామకుప్పం మండలం, కొంగనపల్లి నుంచి తన పర్యటనను ప్రారంభించారు  చంద్రబాబు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికాయి. కొంగనపల్లి నుంచి కొల్లుపల్లి, జల్దిగానిపల్లి మీదుగా రోడ్ షో రామకుప్పానికి చేరనుంది. రామకుప్పంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ నాయకులు తమ పార్టీ జెండాలు కట్టారు. ముఖ్యంగా రామకుప్పం మండలం కొల్లుపల్లెలో స్థానిక వైసిపి నేతలు దారిపొడవున పార్టీ జెండాలు కట్టారు. వాటిపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  వాటిని తొలగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల పట్టించుకోకపోయేసరికి... వాళ్లే స్వయంగా జెండాలు పీకే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ నేతల తీరుకు నిరసనగా టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.  

17:42 PM (IST)  •  24 Aug 2022

నల్గొండ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్- ఒకరు సజీవదహనం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం కారణంగా కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలినట్టు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి ఒకరు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. కానీ మరికొందరు చనిపోయినట్టు అక్కడ పని చేసేవాళ్లు చెబుతున్నారు. చాలా మంది గాయపడినట్టు కూడా తెలియజేస్తున్నారు. ప్రమాదం కారణంగా పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 

17:35 PM (IST)  •  24 Aug 2022

హైదరాబాద్‌ పాతబస్తీలో హై అలర్ట్- భద్రతా బలగాల ఫ్లాగ్‌ మార్చ్

హైదరాబాద్‌లోని పాతబస్తీలో హై అలర్ట్‌ ప్రకటించింది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ర్యాపిడ్‌ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌, లోకల్‌ పోలీసులు పాతబస్తీలో భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. 

16:50 PM (IST)  •  24 Aug 2022

శాంతి భద్రతలపై సీఎం అత్యవసర సమావేశం

తెలంగాణలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్‌, ఇద్దరు ఐజీలు , మూడు కమిషనరేట్‌ సీపీలు పాల్గొన్నారు. 

16:16 PM (IST)  •  24 Aug 2022

బండి సంజయ్‌ యాత్రపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

బండి సంజయ్ యాత్రపై విచారణ చేపట్టిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పాదయాత్ర ఆపేయాలన్న జనగామ పోలీసుల నోటీసులపై బీజేపీ న్యాయపోరాటం చేస్తోంది. కోర్టులోనే తేల్చోవాలని నిర్ణయించి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు బండి సంజయ్. దీనిపై 3.45 గంటలకు విచారించిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.