అన్వేషించండి

MK Meena: ఏపీలో ఓట్ల గల్లంతు ఫిర్యాదులు - ఎన్నికల కమిషనర్ ను ఢిల్లీకి పిలిచిన సీఈసీ

MK Meena: ఏపీలో ఓట్ల గల్లంతు ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం.. ఏపీ ఎన్నికల కమిషన్ ను ఢిల్లీకి రావాలంటూ పిలిచింది. 

MK Meena: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచింది. సీఈసీ పిలుపుతో ఆయన ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతు అయ్యాయని విపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనను సీఈసీ ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిన ఓట్లు రేచ్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు పార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థలు పిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముఖేశ్ కుమార్ మీనాను ఢిల్లీకి పిలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వచ్చేటప్పుడు ఏపీ ఓటర్ల జాబితాతో పాటు ముఖ్యమైన ఫైళ్లను కూడా వెంట తీసుకు రావాలని కూడా చెప్పినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో.  

'20 లక్షల దొంగ ఓట్లు గుర్తించాం'

ఓటరు ధ్రువీకరణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లు గుర్తించినట్లు ఇటీవలే చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా ఫేక్ ఓట్లను గుర్తించామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారిని కోరుతూ.. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను అందిజేశామని చంద్రబాబుకు నేతలు వివరించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయించడం, టీడీపీ అనుకూలం అని భావించే వారి ఓట్లను తీసేయడం, ఒక బూత్ లోని ఓట్లను మరో బూత్ లోకి మార్చడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు టీడీపీ నాయకులు చంద్రబాబుకు వివరించారు. వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలకు పాల్పడటమే కాకుడా.. ఆ నిందను టీడీపీపై వేస్తోందని.. ఈ చర్యను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో ఓటర్ వెరిఫికేషన్ ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అలా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. అర్హులు కాని వారికి ఓట్ల విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేసే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చంద్రబాబు నేతలతో సమీక్ష సందర్భంగా హెచ్చరించారు. 

ఒకే ఇంటి నంబర్ తో పదుల సంఖ్యలో ఓట్లు.. 

ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపుతున్నట్లు గుర్తించామని టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబర్ తో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలా దొంగ ఓట్లు నమోదు చేసేందుకు కొంత మంది అధికారులు వైసీపీ పార్టీకి సహకరిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. రేపటి రోజుల్లో సీఎం జగన్ పదవి పోతే మనమే అన్నా క్యాంటీన్ ద్వారా ఇంత కూడు పెడదాం అంటూ కామెంట్లు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
AI Generated Videos : AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
Embed widget