అన్వేషించండి

Breaking News Live Telugu Updates: బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్‌

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

Key Events
Andhra Pradesh Telangana Telugu Breaking News Live Updates 22 May 2023 Breaking News Live Telugu Updates: బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్‌
ప్రతీకాత్మక చిత్రం

Background

Breaking News Live Telugu Updates: 

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసు విచారణలో మరో ట్విస్ట్. విచారణకు పిలిచినప్పుడల్లా వివిధ కారణాలతో గైర్హాజరవుతున్న అవినాష్ రెడ్డి విషయంలో దూకుడుగా వెళ్లాలని సీబీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

సీబీఐ సీరియస్

తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కొన్ని రోజుల వరకు విచారణ రాలేనని ఆదివారం రాత్రి సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీబీఐ సీరియస్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా కర్నూలు జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారులు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని లొంగిపోవాలంటూ రాయబారం పంపించారని సమాచారం. 

ఎస్పీతో మంతనాలు

అరెస్టుకు ప్రయత్నాలు

అవినాష్‌ను అదుపులోకి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ప్రస్తుతం అవినాష్ అమ్మ ఆరోగ్య పరిస్థితిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారని టాక్. ఏ క్షణంలోనైనా అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. 

ఇన్నాళ్లు హైదరాబాద్‌ కేంద్రంగా నడిచిన హైడ్రామాకు ఇప్పుడు కర్నూలు వేదిక అయింది. నాలుగు రోజులుగా కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం ఉంది. 

శుక్రవారం నుంచి కర్నూలులో హైటెన్షన్

శుక్రవారమే సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి రావాల్సి ఉంది. కానీ తన తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పి సీబీఐకి సమాచారం ఇచ్చి పులివెందుల బయల్దేరి వెళ్లారు. తల్లిని కర్నూలులో చేర్పించాలని అక్కడకు వెళ్లిపోయారు. ఎంపీ వైఎస్‌ అనినాష్‌ రెడ్డి తల్లి లక్ష్మమ్మకు విశ్వభారతి ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. దీంతో అవినాష్‌ సీబీఐ కార్యాలయానికి వెళ్లకుండా ఆగమేఘాల మీద తల్లిని చూసేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా  తాడిపత్రి మండలంలోని చుక్కలూరు వద్ద తల్లి లక్ష్మమ్మను అంబులెన్స్‌ చూసి, వెంట తన కాన్వాయ్‌తో అవినాష్‌ హైదరాబాద్‌కు బయల్దేరారు. కానీ ఏమైందో కానీ ఆమెను కర్నూలు తీసుకెళ్లిపోయారు. 

కర్నూలు నగరంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వైద్యులు ఆమెకు గుండె సంబంధిత పరీక్షలు చేశారు. లోబీపీ, ఈసీజీలో కొన్ని మార్పులు ఉన్నాయని, కార్డియాక్‌ ఎంజేమ్స్‌ బాగా పెరగడం వల్ల యాంజియోగ్రామ్‌ చేయాల్సి వస్తుందని కార్డియాలజిస్ట్‌  డాక్టర్‌ హితేష్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

ఈ టైంలోనే సోమవారం కచ్చితంగా విచారణకు రావాల్సిందేనంటూ అవినాష్‌ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. దీనికి రిప్లై ఇచ్చిన ఎంపి.. తన తల్లి ఆరోగ్యం కుదట  పడే వరకు విచారణకు రాలేనంటూ లేఖ రాశారు. చికిత్స పొందుతున్న తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన తర్వాత విచారణకు రావడానికి ఏ ఇబ్బంది లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పలుమార్లు వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇటీవల ఈనెల 16, 19న రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరు కావడం తెలిసిందే. మరోసారి తాను విచారణకు హాజరు కాలేనంటూ వైసీపీ ఎంపీ లేఖ రాయడంతో సీబీఐ ఇప్పుడు ఆయన్ని అరెస్టు చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

09:16 AM (IST)  •  22 May 2023

బందరు బయల్దేరిన సీఎం జగన్- కాసేపట్లో పోర్టుకు శంకుస్థాపన

బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకుంటారు. అక్కడే భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించనున్నారు. 

09:07 AM (IST)  •  22 May 2023

Breaking News: ముమ్మడివరంలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి 

ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ముమ్మిడి వరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారును లాలీ ఢీ కొట్టడంతో కారులో ఉన్న వారిలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. స్వామి, రమేష్ కృష్ణ చనిపోయినట్టు గుర్తించారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget