అన్వేషించండి

Coriander Aloo With Puri : కొత్తిమీర ఆలూ.. క్రిస్పీ పూరీలు.. కలిపి తింటే ఉంటాది.. నోరూరించే రెసిపీలు ఇవే

Dhaniya Aloo Curry With Crispy Puri : టేస్టీ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అలాంటప్పుడూ ఇంట్లోనే కొన్ని రకాల వెరైటీలు ట్రై చేయవచ్చు. అలాంటి రెసిపీనే కొత్తిమీర ఆలూ.. క్రిస్పీ పూరీ. 

Tasty South Indian Breakfast : ఉదయాన్నే టేస్టీగా తినాలనిపించినప్పుడు చక్కగా ఇంట్లో తయారు చేసుకోగలిగే రెసిపీలు చాలా ఉన్నాయి. పైగా వాటిని చేసుకునేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. రుచిలోనూ.. హెల్త్​ విషయంలోనూ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. పైగా కొన్ని కాంబినేషన్స్​ కచ్చితంగా ట్రై చేయాలి. వాటిని బయట ఆర్డర్ ఇస్తే ఎలా చేస్తారోననే భయం ఉంటుంది కాబట్టి.. ఇంట్లోనే చేసుకోగలిగే రెసిపీలు ట్రై చేయాలి. అలాంటి కాంబినేషనే కొత్తిమీర ఆలూ.. క్రిస్పీ పూరీలు. వీటిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - 200 గ్రాములు

రవ్వ - 100 గ్రాములు 

ఉప్పు - అర టీస్పూన్

నూనె - వంటకి తగినంత

నీరు - వంటకి తగినంత

కొత్తిమీర - 1 కట్ట

పచ్చిమిర్చి - 3

అల్లం - అంగుళం 

బంగాళదుంపలు - 400 గ్రాములు

జీలకర్ర - అర టీస్పూన్

ధనియాలు - 1/2 టీస్పూన్

బే ఆకు - 1

ఉప్పు - రుచికి తగినంత

కారం - 1 టీస్పూన్

ధనియాల పొడి - 1 టీస్పూన్

పసుపు - 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి.. రవ్వ వేసి బాగా కలపండి. దానిలో పిండికి సరిపడేంత ఉప్పు.. రెండు చెంచాల నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు పిండిని మెత్తగా, పూరీలకు సరిపడే విధంగా సరిపోయేంత నీరు పోసి పిండిని ఉండలు లేకుండా మెత్తగా కలపాలి. పిండిలో ఉండలు ఉంటే పూరీలు సరిగ్గా రావు కాబట్టి. పిండిని బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపిన పిండిని ఓ అరగంట పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పూరీలు బాగా వస్తాయి. 

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని దానిలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసి పేస్ట్ చేయాలి. మెత్తగా అయ్యేందుకు కాస్త నీరు కూడా బాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్​ని తీసుకుని దానిలో బంగాళదుంపల ముక్కలను వేయాలి. అవి ఉడికేంత నీటిని వేసి.. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనిలో చిటికెడు ఉప్పు వేస్తే దుంపలు బాగా ఉడుకుతాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. ప్రెషర్​ను తీయాలి. వేడి నీటిని పారేసి.. చల్లని నీళ్లు వేసి.. దుంపలపై ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. దానిలో జీలకర్ర, ధనియాలు, బే ఆకు అంటే బిర్యానీ ఆకును వేసి బాగా కలపాలి. ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ప్యూరీని వేసి.. రెండు నిమిషాలు ఉడికించాలి. దానిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఉడికించాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఉడికించిన బంగాళ దుంపలు వేసి బాగా కలపాలి. అనంతరం దానిలో కాస్త నీరు వేసి 3 నిమిషాలు ఉడికించాలి. బాగా కలిపి మూత వేసి మరో 7 నిమిషాలు ఉడికించాలి. ఉప్పు చెక్ చేసుకుని.. సరిపోకపోతే కాస్త వేసి.. స్టౌవ్ ఆపేయాలి. 

ఇప్పుడు ముందుగా నానబెట్టిన పిండిని తీసుకుని.. చిన్న బంతిగా చేసుకోవాలి. చపాతీ కర్రతో వాటిని ఒత్తుకోవాలి. ఇలా మొత్తం పిండిని పూరీలుగా, గుండ్రంగా ఒత్తుకున్న తర్వాత.. పెద్ద కడాయి తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనెను వేసి.. స్టౌవ్​ను తగ్గించాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు తయారు చేసి పెట్టుకున్న పూరీలను నూనెలో వేసి.. గోల్డెన్ బ్రౌన్, క్రిస్పీగా వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ ఉండకూడదు అనుకుంటే పూరీలను నూనెనుంచి తీసి.. టిష్యూలపై వేసుకోవచ్చు. దీనివల్ల నూనె తగ్గిపోతుంది. ఇప్పుడు ముందుగా చేసుకున్న కొత్తిమీర ఆలుతో కలిపి హాయిగా వీటిని లాగించేయవచ్చు. 

Also Read : టైప్ 1 డయాబెటిస్ రోగుల జీవితాలను మార్చే 'ఆర్టిఫీషియల్ ప్యాంక్రియాస్'.. ప్రపంచంలోనే మొదటిసారిగా 1000 మందికి ఇంజెక్ట్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget