అన్వేషించండి

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న ఈ నలుగురికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు అనుమతించాలంటూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్- 1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ జూన్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులును కొట్టివేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై జూన్ 10న న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరీక్షకు అనుమతించి.. ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. నిందితులు షమీమ్, సురేష్, రమేష్, సాయి సుష్మితలకు హాల్‌టికెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న ఈ నలుగురికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు అనుమతించాలంటూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 11న జరుగుతున్న గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు ఇతర శాఖాపరమైన పరీక్షల్లో పాల్గొనకుండా డిబార్ చేయడాన్ని సవాలు చేస్తూ రమేష్ కుమార్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పి.మాధవీదేవి కమిషన్‌కు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. పిటిషనర్లకు హాల్‌టిక్కెట్‌లు అందజేసి పరీక్షలకు అనుమతించాలని, అయితే ఫలితాలను వెల్లడించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ టీఎస్‌పీస్సీ జూన్ 10న హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

పరీక్షలు నిలిపివేయడం పరిష్కారం కాదు.. హైకోర్టు వ్యాఖ్యలు
ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలో తాజాగా నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను నిలిపివేయడం సమస్యకు పరిష్కారం కాదని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లీకేజీ వ్యవహారం బయటపడడంతో పరీక్షలను రద్దుచేసి తిరిగి నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ చేస్తున్న ప్రయత్నాలను గౌరవించాలని పేర్కొంది. పరీక్షల నిర్వహణకు రాజ్యాంగ సంస్థ అయిన టీఎస్‌పీఎస్సీ కాకుండా మరో సంస్థపై ఆధారపడలేమని తేల్చిచెప్పింది. 3.80 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయలేమని అప్పీలును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్.మురళీధర్ రెడ్డి అప్పీలు దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

పిటిషనర్ల తరఫు న్యాయవాది సుధీర్ వాదనలు వినిపిస్తూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను హడావుడిగా నిర్వహించాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని ప్రతి ఒక్కరినీ అనుమానించడం సరికాదని పేర్కొంది. లీకేజీపై దర్యాప్తు కొనసాగుతోందని, దాన్ని న్యాయవ్యవస్థ చూసుకుంటుందని, అది పూర్తయ్యే దాకా పరీక్షలు నిర్వహించరాదనడం సరికాదంది. పిటిషనర్ కోరినట్లు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే అది పూర్తవడానికి 20 ఏళ్లు పడుతుందని, అప్పటివరకు పరీక్షలు నిర్వహించకూడదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్, టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావులు వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంటూ, అప్పీలును కొట్టివేసింది.

సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి...
టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ ఇంజినీరు, డిప్యూటీ ఏవో ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి సిట్ నిర్వహిస్తున్న దర్యాప్తుపై సమగ్ర వివరాలతో మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటరును పరిశీలిస్తే సిట్ దర్యాప్తుపై ఒక అంచనాకు వచ్చి సీబీఐకి అప్పగించాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయించవచ్చంది. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జూన్ 9న జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇప్పటివరకు సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

Related Articles:

రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget