News
News
వీడియోలు ఆటలు
X

Coronavirus Cases India : దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు- ఒక్క‌రోజే 7830 కేసులు నమోదు

Coronavirus Cases India : దేశంలో 223 రోజుల తర్వాత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 8వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

FOLLOW US: 
Share:

Coronavirus Cases India : దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,14,242 మందికి పరీక్షలు నిర్వ‌హించ‌గా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ (ministry of health) బుధవారం వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ 223 రోజుల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. 

మంగ‌ళ‌వారం ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 40,215 కు పెరిగింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 16 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య‌ 5,31,016 కు పెరిగింది.

ఢిల్లీ, పంజాబ్, హిమాచల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాలలో ఇద్ద‌రు చొప్పున‌, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. కేర‌ళ‌లో ఐదు వైరస్ సంబంధిత మరణాలు న‌మోదయ్యాయి. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు.

మంగ‌ళ‌వారం 5,676 న‌మోద‌వ‌గా, బుధ‌వారం 7,830 కేసులు న‌మోదు కావ‌డంతో భారీ పెరుగుద‌ల క‌నిపించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,47,76,002కి చేరుకుంది. 

గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ సుమారు 7 నెల‌ల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి.

XBB1.16 వేరియంట్‌కు సంబంధించిన 1,774 కేసులు 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో గుర్తించారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా ప్రకారం, వైర‌స్‌ సోకిన వారిలో 230 మందికి పైగా Omicron వేరియంట్‌కు చెందిన సబ్-వేరియంట్ XBB1.16.1 బారిన పడ్డారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు మొత్తం యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి, అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని పేర్కొంది. అందుకే పాజిటివ్‌గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని వెల్ల‌డించింది. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇవ్వటంతో పాటుగా నివారణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సోమ‌వారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌19 తాజా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులపై అధికారులు జగన్ కు నివేదికను సమర్పించారు. గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్న వారికి కొవిడ్‌19 సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలు చేప‌ట్టాలని అధికారులకు సూచించారు.

Published at : 12 Apr 2023 12:56 PM (IST) Tags: Corona Cases In India Corona Cases COVID 19

సంబంధిత కథనాలు

Corona New Variant: మీ పిల్లల కళ్లు ఈ కలర్‌లోకి మారుతున్నాయా? జాగ్రత్త, అది కరోనా కొత్త వేరియంట్ ఆర్క్టురస్ లక్షణం

Corona New Variant: మీ పిల్లల కళ్లు ఈ కలర్‌లోకి మారుతున్నాయా? జాగ్రత్త, అది కరోనా కొత్త వేరియంట్ ఆర్క్టురస్ లక్షణం

మరో కరోనా వేవ్ వచ్చేలా ఉందే! ఒక్కరోజులో 12 వేలకుపైగా కేసులు నమోదు

మరో కరోనా వేవ్ వచ్చేలా ఉందే! ఒక్కరోజులో 12 వేలకుపైగా కేసులు నమోదు

తగ్గేదేలే అంటున్న కరోనా- 24 గంటల్లో 7633 కొత్త కేసులు నమోదు

తగ్గేదేలే అంటున్న కరోనా- 24 గంటల్లో 7633 కొత్త కేసులు నమోదు

Air Pollution: వాయు కాలుష్యం కోవిడ్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది

Air Pollution: వాయు కాలుష్యం కోవిడ్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది

దేశంలో భయపెడుతున్న కరోనా - 24 గంటల్లో 3 వేలకుపైగా కేసులు నమోదు

దేశంలో భయపెడుతున్న కరోనా - 24 గంటల్లో  3 వేలకుపైగా కేసులు నమోదు

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!