Trinayani Serial Today July 30th: 'త్రినయని' సీరియల్: పిల్లలకు తాయెత్తులు కట్టిన తిలోత్తమ.. గాయత్రీ పాపను ఆత్మ ఆవహిస్తుందా, నయని కనిపెడుతుందా!
Trinayani Serial Today Episode తిలోత్తమ పిల్లలకు నయని అంగీకారంతో గంటలమ్మ ఇచ్చిన తాయెత్తులు కట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode స్వామిజీ దర్శనం ఇచ్చి తాయెత్తులు ఇచ్చారని నలుగురు పిల్లలకు కట్టమన్నారని తిలోత్తమ ఇంట్లో వాళ్లతో చెప్తుంది. నయని, హాసిని, విశాల్ అందరూ వద్దని అంటారు. దానికి తిలోత్తమ గుడ్డిగా నమ్మకూడదని ఇలా చెప్పడమే మంచిదని అంటుంది.
తిలోత్తమ: స్వామి వారిని కలిశాక గాయత్రీ అక్క గురించి ఆరా తీశాను. ఆత్మగా వస్తుందే తప్ప పునర్జన్మలో ఎక్కడుందో కన్న తల్లిదండ్రులకు కూడా తెలీడం లేదని చెప్పాను.
నయని: మేం ఏం బాధ పడటం లేదు అత్తయ్య. అమ్మగారు ఏదో రోజు ఇంట్లో అడుగుపెడతారని ఎదురు చూస్తున్నాం.
సుమన: ఏదైనా అంటే ఈ రెండు మాటలు మాత్రం చెప్తారు.
విక్రాంత్: వాళ్లకి లేని బాధ నీకు ఎందుకే.
దురంధర: ఒక్క నిమిషం విక్కీ, గాయత్రీ వదిన పునర్జన్మలో కనిపించలేదు సరే ఈ తాయెత్తులకు సంబంధం ఏంటి.
తిలోత్తమ: నిజమే నువ్వు అడిగినట్లే అడిగాను దురంధర, అప్పుడు స్వామి వారు ఈ తాయెత్తులు ఇచ్చి నలుగురి పిల్లలకు ఈ తాయెత్తులు కడితే ఎవరో ఒకరి శరీరంలోకి గాయత్రీ దేవి ఆత్మ వస్తుందట.
విశాల్: అమ్మ అది ఎలా సాధ్యం.
తిలోత్తమ: గాయత్రీ అక్క ఆత్మ ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వారి మెడలో ఉంటే తాయెత్తు తెగిపోతుందట. అప్పుడు ఆ ఆత్మే గాయత్రీ అక్కయ్య పునర్జన్మ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తుందట.
దురంధర: నయని ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది. ఒక ప్రయత్నం చేస్తే పోయేది ఏముంది.
హాసిని: విశాల్ వైపు చూసింది అంటే వద్దనే అర్థం.
తాయెత్తులు కట్టించడానికి నయని అంగీకరిస్తుంది. గానవి, పుండరీనాథం, ఉలూచిలు కట్టడానికి ఓకే అని గాయత్రీ పాపకి కూడా అడుగుతాను అని నయని అడుగుతుంది. పాప ఓకే చెప్తే కడతామని అంటుంది. ఓకే అని పాప దంబ్ చూపిస్తుంది. విశాల్ షాక్ అయిపోతాడు. తిలోత్తమ పిల్లలందరికీ తాయెత్తులు కడుతుంది. విశాల్ ఫైల్స్ చూస్తూ ఉదయం నుంచి విపరీతమైన తలనొప్పి అని చిరాకుపడతాడు. ఇక నయని మందులు ఇస్తుంది. ఇక విశాల్ నయనిని హగ్ చేసుకుంటాడు.
సుమన: ఏంటి బుల్లి బావగారు మీ అమ్మ పిల్లల మెడలో తాయెత్తులు కడుతున్నప్పుడు వేసేది ఏదో గోల్డ్ చైన్స్ వేయమని అడగొచ్చు కదా.
విక్రాంత్: వెటకారంగా నాకు ఆ ఐడియా రాలేదు సుమన.
సుమన: ముందు ఆ తాయెత్తుల వెనక రహస్యం కనుక్కోండి.
విక్రాంత్: చెప్పిందిగా గాయత్రీ పెద్దమ్మ ఆత్మ కోసమని.
సుమన: దాని వల్ల వచ్చే లాభం మా అక్కకే కదా.
విక్రాంత్: నీకు వరిగేది ఏం లేదన్నప్పుడు నీ బిడ్డకి తాయెత్తు కట్టొద్దని చెప్పేయాల్సింది.
సుమన: అత్తయ్యని ఎదిరించడం ఎందుకు అని ఏం అనలేదు.
ఉదయం నయని, విశాల్, పావనా మూర్తి, హాసినిలు పిల్లల్ని పెట్టుకొని ఎవరి తాయెత్తు ఊడిపోతుందా అని చూస్తుంటారు. అమ్మ శరీరం ఉన్న పాప పడుకుంటేనే ఆత్మ వస్తుందని విశాల్ అంటాడు. ఇక హాసిని నలుగురి పిల్లల మెడలో తాయెత్తు ఉంచే కంటే ఒక్క గాయత్రీ పాప మెడలోనే ఉంచితే సరిపోతుందని అంటుంది. అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















