Jagadhatri Serial: కౌషికి దగ్గర నుంచి తీసుకున్న షేర్లు నిషిక ఏం చేయాలనుకుంటుంది..?కొత్తగా పుట్టుకొచ్చిన భార్య, కొడుకును చూసి మీనన్ షాక్ తిన్నాడా..?
Jagadhatri Serial Today Episode March 24th:కౌషికి దగ్గర నుంచి తీసుకున్న షేర్లు నిషిక ఏం చేయాలనుకుంటుంది..?కొత్తగా పుట్టుకొచ్చిన భార్య, కొడుకును చూసి మీనన్ షాక్ తిన్నాడా..?

Jagadhatri Serial Today Episode: కంపెనీ షేర్లు తమ పేరిట రావడంతో వైజయంతి, యువరాజు సంతోషపడుతుండగా..నిషిక మాత్రం చాలా ఆందోళనగా ఉంటుంది. ఇప్పుడు షేర్లు మన పేరిట ఉన్నాయి కదా ఎందుకు అలా ఉన్నావంటే...షేర్లు మన పేరిట ఉన్నా కంపెనీ మాత్రం మనది కాదని దానికి సీఈవోగా వదిన ఉన్నంత వరకు మనం ఏం చేయలేమని అంటుంది. అయితే వాళ్లు చెప్పినట్లు ఈ పేపర్లు చిత్తు కాగితాలేనా అని అనగా....మనం వాళ్లకు తెలిసి షేర్లు అమ్మం కానీ తెలియకుండా అమ్ముకోవచ్చు కదా అని అంటుంది. అంటే మనం బయటివాళ్లకు ఈ షేర్లు అమ్మి కోట్లు సంపాదించుకోవచ్చని అంటుంది. ఆ డబ్బులతో మనమే ఓ కంపెనీ పెట్టుకుందామని అప్పుడు మనల్ని ఆపడానికి ఎవరూ ఉండరని అంటుంది. ఒకవేళ బయటి వాళ్లకు ఈ షేర్లు అమ్మిన తర్వాత మీ మామయ్య, వదిన ఏమైనా పనికిరాకుండా చేస్తే ఏం చేద్దామని అంటే...అప్పుడు కొన్నవాళ్లు, వీళ్లు చూసుకుంటారని మనకు పోయేది ఏముంటుదని అంటుంది.
ఈ మాటలన్నీ విన్న జగధాత్రి, కేదార్ గదిలోకి వచ్చి నిషికపై మండిపడతారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే మీలాంటి వాళ్లను ఎక్కడా చూడలేదని అంటారు. నిషికకు అంటే తెలియకపోవచ్చు...నీకు కంపెనీ విషయాలన్నీ తెలుసుకదా యువరాజు అని కేదార్ నిలదీస్తాడు. ఈ కంపెనీని ఎలాగైనా భూస్థాపితం చేయాలని మన ప్రత్యర్థులు ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా తెలుసు కదా అని అంటాడు. వాళ్ల చేతుల్లోకి ఈ షేర్లు వెళ్లాలంటే మన కంపెనీ మూతపడుతుందని...ఇక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది జీవితాలు రోడ్డుమీదకు వస్తాయని జగధాత్రి హెచ్చరిస్తుంది. వస్తే రానివ్వండని నాకు ఏంటి సంబంధం అని యువరాజు అంటాడు. కంపెనీ ఏమైపోతే నాకేంటని ఎవరు ఇబ్బందుల్లోపడితే నాకేంటని అంటాడు. ఆ మాటలు విన్న జగధాత్రి, కేదార్ బయటకు వెళ్లిపోతారు. వీళ్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయేలా ఉన్నారని ధాత్రి అంటుంది.ఆ షేర్లు ఎవరూ కొనకుండా చూసే బాధ్యత మనదని అంటుంది.
జేడీ తనను చూసిన తర్వాత కూడా తనకోసం పోలీసులు ఎందుకు వెతకడం లేదో అర్థంగాక....మీనన్ పిచ్చెక్కిపోతుంటాడు. తాను చనిపోయానని అందరూ రిలాక్స్గా ఉన్నారని ఇలా దొంగచాటుగా బతకడం కష్టంగా ఉందని అంటాడు. మళ్లీ దందా మొదలుపెట్టాలని తన అనుచరులతో చెబుతుండగా....హోంమినిష్టర్ తమ్ముడు అక్కడికి వచ్చి టీవీలో నీ గురించి చూపిస్తున్నారని చెప్పడంత టీవీ ఆన్చేస్తాడు. అక్కడ వచ్చే న్యూస్ చూసి మీనన్ షాక్ తింటాడు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో బతికిన మీనన్ భార్య తొలిసారి మీడియా ముందుకు వస్తుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. అసలు తనకు పెళ్లి కాలేదని...మరి ఈ భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటాడు. ఇంతలో జేడీ,కేడీ జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన డ్రాగన్....మీనన్ సమాధి వద్దకు వచ్చి ఏడుస్తుంది. మీడియా మొత్తం నువ్వు మీనన్ భార్యవని నమ్మకం ఏంటని అనగా...తనకు, మీనన్కు పుట్టిన కుమారుడు ఇదిగో అంటూ కొడుకును పరిచయం చేస్తుంది.అది చూసిన మీనన్కు ఇంకా అయోమయానికి గురవుతాడు. అభి మాత్రం ఆమె నీ భార్యేనంటూ మీనన్కు చిరాకు తెప్పిస్తాడు. ఇంకా రుజువులు కావాలంటే చూపుతానంటూ డ్రాగన్ మీడియా వాళ్లందరినీ తీసుకుని మీనన్ ఇంటికి వెళ్తుంది.























