Jagadhatri Serial Today April 30th:చిలకమ్మ ఎవరో నిషిక కనిపెట్టిందా...? జగధాత్రి నిజం చెప్పేసిందా..?
Jagadhatri Serial Today Episode April 30th: చిలకమ్మ ఎవరో నిషిక కనిపెట్టిందా...? జగధాత్రి నిజం చెప్పేసిందా..?

Jagadhatri Serial Today Episode: రాహుల్ను కృష్ణమూర్తితో చంపించిన జేడీ బాడీని షిప్ట్చేస్తుండగా మంత్రి అక్కడి వచ్చి గొడవ చేయాలని చూస్తాడు. మాకు ఈ ఎన్కౌంటర్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జేడీని మంత్రి బెదిరిస్తాడు.ఇందంతా మీరే చేశారని నాకు తెలుసని...రాహూల్ బాడీలో బుల్లెట్ నీదేనని నిరూపిస్తే నీ ఉద్యోగం పోతుందని బెదిరిస్తాడు.నా గన్ పోయినట్లు మూడురోజులు క్రితమే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశానని జేడీ చెబుతుంది.ఆగన్ కృష్ణమూర్తిగా దొంగతనం చేసి ఇప్పుడు రాహూల్ను కాల్చి చంపారని చెబుతుంది. ఎందుకైనా మంచిది నీ కొడుకుని కూడా చేసిన తప్పులు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోకుంటే...ఎదో ఒకరోజు ఇలా రోడ్డుపై కుక్కచావు చస్తాడని హెచ్చరిస్తుంది.అసలే కృష్ణమూర్తిగారు చాలా కోపంగా మీ కొడుకు గురించి వెతుకుతున్నాడని చెబుతుంది.దీంతో చేసేది ఏమీ లేక మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొడుక్కి ఫోన్ చేసి జాగ్రత్తగా సేఫ్హౌస్కు వెళ్లిదాక్కోమని చెబుతాడు.
ఇంటి పనులతో వంటపనులన్నీ చేసి భోజనాలు వడ్డించడానికి చిలకమ్మ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.అందరూ భోజనాలు తినడానికి రాగా....చిలకమ్మ సుధాకర్కు వడ్డించడంతో వైజయంతి మండిపడుతుంది. ఇంతలో అతనికి దగ్గురావడంతో చిలకమ్మ మంచినీళ్లు తాగించి నెత్తిమీద కొట్టడంతో వైజయంతి కోపం నషానానికి ఎక్కుతుంది. ఇంతలో జగధాత్రి కల్పించుకుని మామయ్యకు ఆస్తమా ఉంది కదా అత్తయ్యా అందుకే చిలకమ్మమంచినీళ్లు తాగించిందిలే అని సర్ధిచెబుతుంది. ఇంతలో చిలకమ్మ తాను పనిమనిషినని మర్చిపోయి..ఎంతో ఆనందంతో నీకు రొయ్యలకూర చేశానని జగధాత్రికి చెప్పడంతో...నిషికకు అనుమానం వస్తుంది.అయినా దానికి రొయ్యల కూర ఇష్టమని నీకు ఎలా తెలుసని అంటుంది. నా మేనకోడలు గురించి నాకు తెలియదా అనడంతో అందరూ షాక్ తింటారు.ఇంతలో ధాత్రి కల్పించుకుని వాళ్ల కోడలు గురించి చెబుతుందిలే అని అంటుంది, దీంతో నిషిక అన్నం తినకుండా గదిలోకి వెళ్లిపోవడంతో వైజయంతి అమ్మికి పాలు ఇచ్చిరా అని చిలకమ్మను పంపిస్తుంది.
పాలు తాగే ముందు టాబ్లెట్ వేసుకోమని యువరాజు చెప్పగా...ఎందుకని చిలకమ్మ అడుగుతుంది.ఇప్పుడు నిషిక కడుపుతో ఉందని చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతుంది. తాను చిలకమ్మనని మర్చిపోయి సంతోషంతో సంబరపడిపోతుంది.ఈ విషయం మీ అమ్మానాన్నకు చెప్పావా లేదా అని అంటుంది. అయినే నేనే చెబుతాను ఉండూ అంటూ కిందకు వెళ్తుంది.అయినా నేను కడుపుతో ఉంటే ఈవిడకు ఎందుకు ఇంత ఆనందమని నిషి యువరాజుతో అంటుంది.అసలు ఈ చిలకమ్మ సంగతి ఏంటో తేల్చేద్దామని కిందకు వస్తారు. ఇంతలో చిలకమ్మ జగధాత్రిని పిలిచి నిషిక కడుపుతో ఉన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదని...మీ నాన్నకు కూడా ఎందుకు చెప్పలేదని నేను చెబుతాను ఉండూ అంటూ ఫోన్ చేయబోతుంది. ఇంతలో జగధాత్రి అడ్డుపడుతుంది. ఇంట్లో వాళ్లందరికీ అనుమానం వస్తుంది.అయినా మా సంగతులన్నీ నీకు ఎలా తెలుసని నిషిక నిలదీస్తుంది. అప్పుడే కేదార్ పనిమనిషి రాధను ప్రవేశపెడతాడు. ఆమెవచ్చి మీరు కొత్త పనిమనిషిని పెట్టుకున్నారని మాకు అనుమానం వచ్చిందని అంటుంది.ఈవిడ ఎవరని నిలదీయగా....ఆమె మా బంధువుల ఆమేనని జగధాత్రి చెబుతుంది.అయితే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని,,,రెండు,మూడు ప్రశ్నలు కుటుంబం గురించి అడగడంతో చిలకమ్మ చెబుతుంది. దీంతో వాళ్లు వెళ్లిపోతారు.ఇలాంటి రోజు వస్తుందనే నేను మన ఇంటి విషయాలన్నీ చిలకమ్మకు చెప్పానని...అందుకే ఆవిడ వరుసలు పెట్టి పిలుస్తుందని జగధాత్రి నిషిక,కౌషికికి చెబుతుంది.
పాతికేళ్లుగా కేదార్కు దూరంగా ఉంటున్న వాళ్ల తాతయ్య...తనతప్పు తెలుసుకుని కేదార్కు దగ్గరవ్వడానికి వస్తాడు.ఇక నేనే అన్నీ అయి తనను చూసుకుంటానని చెబుతాడు. సుధాకర్కు ఫోన్ చేస్తాడు.సుధాకర్ ఎవరని అడగ్గా....అన్నీ మర్చిపోయి 25ఏళ్లుగా హాయిగా బతుకుతున్నావా సుధాకర్ అని అంటాడు.ఎవరు మీరు అని అడగ్గాా...శివశంకర్ అని చెప్పడంతో సుధాకర్ షాక్కు గురవుతాడు.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















