అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 15th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మనుతో అమ్మా అని పిలిపించుకున్న అను – మనును కాలేజీ ఎండీగా ప్రకటించిన మంత్రిగారు

Guppedanta Manasu Today Episode: మనును కాలేజీ ఎండీగా మంత్రిగారు ప్రకటించడంతో.. మను అందుకు తాను సిద్దంగా లేనని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదాం అన్న అనుపమతో మను మిమ్మల్ని ఎవరో బెదిరిస్తున్నారని వాళ్లెవరో చెప్పమని అడుగుతాడు. ఏమైన ఉంటే నేను చూసుకుంటానని అనడంతో అనుపమ నువ్వేం అడిగినా నా మీద ఓట్టే అని ఓట్టేసుకోవడంతో మను కోపంగా నా తండ్రి గురించి అడిగినప్పుడు ఇలాగే కోపంగా ఒట్టు పెట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా ఓట్టు పెట్టారు.. ఇంతకీ నా తండ్రి ఎవరో చెప్తారా? లేదా? అంటూ గన్‌ తీసుకుని తనను తాను షూట్‌ చేసుకోవడానికి ఎయిమ్‌ చేసుకుంటాడు. ఇంతలో మహేంద్ర వచ్చి గన్‌ లాగేసుకుంటాడు.

మహేంద్ర: ఏంటి మను కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి.

మను: పోతే పోనివ్వండి సార్‌ ఎవరికి కావాలి ఈ ప్రాణాలు

మహేంద్ర: అసలు ఏం జరిగింది. ఎందుకు గొడవ పడుతున్నారు.

మను: ఇన్నాళ్లు నా తండ్రి గురించి అడిగితే చెప్పలేదు. ఇప్పుడేమో మీ ఇంట్లోనే ఉండొద్దు అంటున్నారు. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.

మహేంద్ర: అనుపమ అసలు ఏమైంది. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు. అను నేనేమైనా నీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించానా?

అనుపమ: అలాంటిదేం లేదు మహేంద్ర. కానీ ఇకపై మేము నీ ఇంట్లో ఉండము. నీ జీవితం నీది. మా జీవితం మాది.

  అని చెప్పగానే మహేంద్ర, మను షాక్‌ అవుతారు. ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నావు అని మహేంద్ర అడగ్గానే నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఎందుకు? ఏంటి? అని అడగొద్దు అంటుంది అనుపమ. మహేంద్ర సరే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నువ్వు ఇప్పుడు నామాట వింటే త్వరలోనే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.  అంటూ నన్ను అమ్మా అని పిలువు అని అడుగుతుంది అనుపమ. దీంతో మను హ్యాపీగా అమ్మా అని పిలుస్తాడు. మరోవైపు రాధమ్మ నీళ్ల బిందె తీసుకొస్తూ కళ్లు తిరిగి కిందపడిపోతుంది. వసుధార వచ్చి ఫస్ట్‌ ఎయిడ్‌ చేస్తుంది. రంగ వచ్చి డాక్టర్‌కు ఫోన్‌ చేస్తాడు. డాక్టర్‌ వచ్చి ట్రీట్‌మెంట్‌ చేస్తుంది.

డాక్టర్‌: ఇప్పుడు పర్వాలేదు అండి నార్మల్‌గా ఉంది. సీపీఆర్‌ చేసింది మీరేనా.. మీరు సమయానికి సీపీఆర్‌ చేయడం వల్ల ఈరోజు ఆవిడ ప్రాణాలు నిలిచాయి. లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో మేం చెప్పలేము. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా?

రంగ: ఇంతకుముందు ఎప్పుడు రాలేదు డాక్టర్‌ గారు.

రాధమ్మ: నిద్రలో ఒకటి రెండు సార్లు వచ్చినట్టు గుర్తు.

 అని రాధమ్మ చెప్పగానే రంగ, వసుధార షాక్‌ అవుతారు. మాకు ఎందుకు చెప్పలేదని రంగ అడగ్గానే నేను ఇంత సీరియస్‌ అవుతుందనుకోలేదు అంటుంది. దీంతో డాక్టర్‌ జాగ్రత్తలు చెప్పి మెడిసిన్స్‌ రాసిచ్చి వెళ్తుంది. బయటకు వచ్చిన రంగ, వసుధారకు థాంక్స్‌ చెప్తాడు. దీంతో వసుధార నేను ఎంత చెప్పినా మీరు మాత్రం నన్ను మేడం అనడం మానడం లేదు అంటుంది. దీంతో రంగ మీకు ఎంత చెప్పినా నమ్మరా? అంటూ మెడిసిన్స్‌ తీసుకురావడానికి వెళ్తాడు. దీంతో వసుధార కూడా తను నిజంగానే రంగానా అని డైలమాలో పడిపోతుంది. మరోవైపు డీబీఎస్టీ కాలేజీ బోర్డు మీటింగ్‌ జరుగుతుంది.   

మంత్రి: ఈరోజు మీటింగ్‌ ఎందుకు పెట్టానో మీకు అర్థం అయ్యే ఉంటుంది.

శైలేంద్ర: నాకు మాత్రం అర్థం కావడం లేదు. ( అని మనసులో అనుకుంటాడు)

మంత్రి: ఎండీ సీటు గురించి, వసుధార ఎండీ పదవికి రిజైన్‌ చేసి వెళ్లిన తర్వాత ఆ సీటులో ఎవరు కూర్చోవాలో.. ఆ పదవిని ఎవరు స్వీకరించాలో అన్నదాని మీద మనం లాస్ట్ మీటింగ్‌లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేనే ఎండీని అనౌన్స్‌ చేద్దాం అనుకుంటున్నాను.

శైలేంద్ర: వీడేంటి ఇంత ట్విస్ట్‌ ఇచ్చాడు. ( మనసులో అనుకుంటాడు.)

 ఇంతలో మనునే కాలేజీకి ఎండీగా ఎన్నుకుంటున్నాను అని మంత్రిగారు చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. శైలేంద్ర ఆబ్జెక్షన్‌ చెప్తాడు. మంత్రి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. ఇంతలో మను నేను సిద్దంగా లేనని చెప్పడంతో శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతాడు. మిగతావారంతా షాక్‌ అవుతారు. దీంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget