Celebrities Voting LIVE Updates: ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ - ఓటు వేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు, ఎవరెక్కడ?
Tollywood Celebrities Voting LIVE Updates: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో కొందరు, తెలంగాణలో మరికొందరు ఓటు వేశారు. ఎవరెక్కడ ఓటు వేశారో చూడండి.

Background
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. అలాగే, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ మొదలైంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ మొదలైంది. తెలుగు రాష్ట్రాలు రెండిటిలో ఈ రోజు ఎన్నికల హడావిడి నెలకొంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సైతం ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి.
తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో నిలిచారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ నుంచి 21 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే బరిలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నారు. మరో అగ్ర కథానాయకుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. వైసీపీ నుంచి నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి మరోసారి పోటీ చేస్తున్నారు. తెలంగాణ చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి 'పొలిమేర 2' ఫేమ్, నటి సాహితి దాసరి పోటీ పడుతున్నారు. మరికొందరు నటీనటులు కొన్ని చోట్ల పోటీ చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతుగా పలువురు నటీనటులు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పార్టీకి ఓటు వేయమని మెగా హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు పిలుపు ఇచ్చారు. పిఠాపురం వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ ప్రజల మద్దతు కూటమికి ఉన్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. పవన్ సినిమాల్లో నటించిన హీరోయిన్లు, నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు సైతం ఆయనకు అండగా ట్వీట్లు చేశారు.
Also Read: టైమ్ చూసి జగన్ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్ - మాస్ రివేంజ్ షురూ!?
వైసీపీకి మద్దతుగా పోసాని కృష్ణమురళి, అలీతో పాటు యాంకర్ శ్యామల, నటుడు గౌతమ్ రాజు వంటి వారు ప్రచారం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కిశోర్ రెడ్డికి మద్దతుగా మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అది డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఏపీ ఎన్నికలు పక్కన పెడితే... మెజారిటీ సినీ ప్రముఖులకు తెలంగాణలో ఓటు హక్కు ఉంది. పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని యువ హీరోలు అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు సాయి కుమార్ సహా పలువురు వీడియో సందేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు మీద ప్రజలకు అవగాహనా కల్పించే ప్రయత్నం చేశారు. మరి, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఎలా ఉంటుంది? ఎంత మంది ఓటు వేస్తారు? ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు ఎక్కడ ఓటు వేశారు? ఓటు వేసిన తర్వాత ఎవరెవరు ఏం ఏం మాట్లాడారు? అనేది లైవ్ అప్డేట్స్ ద్వారా తెలుసుకోండి.
Also Read: వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?
ఉపాసనతో కలిసి వచ్చి ఓటు వేసిన రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఉదయం ఓటు హక్కు వినియోగించుకోగా... ఆయన తనయుడు & గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మధ్యాహ్నం తర్వాత ఓటు వేశారు.
#GameChanger arrived..#RamCharan @AlwaysRamCharanpic.twitter.com/LE0gqnrsgO
— John Wick (@JohnWick_fb) May 13, 2024
మధ్యాహ్నం తర్వాత ఓటు వేసిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ మధ్యాహ్నం తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం తప్పనిసరి అనే సందేశాన్ని ఆయన ఇచ్చారు.
SuperStar @urstrulyMahesh & #Namrata garu cast their votes 🗳️#ElectionDay #MaheshBabu #LokSabhaElections2024 pic.twitter.com/nvkNDoWToj
— Viswa CM (@ViswaCM1) May 13, 2024





















