అన్వేషించండి

Nara Lokesh - Taraka Ratna : లోకేష్‌ను కలిసిన తారకరత్న - ఎమ్మెల్యే టికెట్ విషయమై చర్చలు?

Telugu Desam Party - AP Elections 2024 తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, యువనేత నారా లోకేష్‌ను నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న కలిశారు.

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసేందుకు మరో నందమూరి కుటుంబ సభ్యుడు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ మనవడు, నందమూరి మోహనకృష్ణ తనయుడు, హీరో తారక రత్న (Nandamuri Taraka Ratna)  కొన్ని రోజులుగా రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు.

లోకేష్‌ను కలిసిన తారకరత్న
Taraka Ratna Met Nara Lokesh : ఈ రోజు ఉదయం నారా లోకేష్‌ను ఆయన నివాసంలో తారక రత్న కలిశారు. కాసేపు ఏకాంతంగా చర్చలు జరిగాయి. ఇద్దరి మధ్య రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా బంధుత్వం ఉంది. ఇటు కుటుంబ, అటు రాజకీయ విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. 

టికెట్ విషయం ఖరారు చేశారా?
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం తారక రత్న వెల్లడించారు. ఈ రోజు లోకేష్ భేటీలో మరోసారి ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ విషయంపై మాటా మంతీ జరిగాయట. తారక రత్నకు ఏ నియోజవర్గం నుంచి టికెట్ కేటాయిస్తారు? ఆయనకు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఉంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

నందమూరి, నారా కుటుంబాలు ఒక్కటే
నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలా ఇటీవల కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుస విమర్శలతో దూకుడు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి తారక రత్న తన సంపూర్ణ మద్దతు తెలిపారు.

Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే? 

ఏపీలో ప్రభుత్వం మారాలి
కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. అప్పుడు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు మేలు జరగడానికి ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

ఎన్టీఆర్ విగ్రహా విష్కరణలో నందమూరి తారకరత్న  మాట్లాడుతూ... ''1982లో కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతిగా మారిందన్నారు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికింది ఎన్టీఆర్. నేడు మన దేశాన్ని పాలించేది ఎన్టీఆర్ ఆలోచన, ఎన్టీఆర్ సృజన. ఆయన కలలు కన్న ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది'' అని చెప్పారు.

Also Read : 'అన్‌స్టాపబుల్‌ 2'లో వీర లెవల్ మాస్ ఎపిసోడ్ లోడింగ్ - ఫిక్స్ అయిపోండి, సంక్రాంతికి రీసౌండ్
 
మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మళ్ళీ మన భావి తరాలవారు సంతోషంగా బతకాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలకు తారకరత్న పిలుపు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం సాధ్యమన్నారు. ఎన్టీఆర్ మనవడిగా, మా బాలయ్య బాబుకు అబ్బాయిగా, చంద్రబాబు నాయుడుకు మేనల్లుడుగా, మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వదాలే తనకు శ్రీరామరక్ష అన్నారు. చివరగా ఆయనకు అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడైనా అంతా మా బాబాయ్ బాలయ్య బాబే అని తారకరత్న అన్నారు. బాలయ్య బాబాయ్ సైన్యాధ్యక్షుడు అయితే మనమంతా సైనికుల్లా  పని చేయాలని అభిమానులకు, తెలుగు దేశం కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget