Maa Inti Bangaram 2 : రెండేళ్లలో మా ఇంటి బంగారం సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన రాజ్ నిడిమోరు
Raj Nidimoru Reaction : సమంత మా ఇంటి బంగారం సీక్వెల్ను ఆమె భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు కన్ఫర్మ్ చేశారు. ఐడియా వచ్చేసిందని రెండేళ్లలో సీక్వెల్ వస్తుందని చెప్పారు.

Raj Nidimoru Reaction About Maa Inti Bangaram Sequel : స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో మూవీ టీం ఫుల్ ఖుష్ అవుతోంది. తాజాగా సాగర తీరం విశాఖలో 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్లో మూవీ టీం సందడి చేసింది. ఇందులో సమంత భర్త రాజ్ నిడిమోరు మా ఇంటి బంగారం సీక్వెల్పై క్లారిటీ ఇచ్చారు.
రెండేళ్లలో సీక్వెల్
మా ఇంటి బంగారం అందరికీ నచ్చింది కాబట్టి సీక్వెల్ కూడా చేద్దామని ఆలోచిస్తున్నట్లు చెప్పారు రాజ్ నిడిమోరు. 'నేను డీకే తెలుగులో ఎప్పుడో మూవీ చేద్దామని హైదరాబాద్ వచ్చాం కానీ ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఫైనల్గా తెలుగులో మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. తెలుగు మూవీ చేస్తే ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. మీ అందరికీ నచ్చింది కాబట్టి మా ఇంటి బంగారం 2 చేద్దామని ఆలోచిస్తున్నా. ఐడియా వచ్చేసింది. రెండేళ్లలో సెకండ్ పార్ట్ మీ ముందుకు తీసుకొస్తాం. సేమ్ టీమ్తో సీక్వెల్ చేస్తాం.' అని చెప్పారు.
Also Read : Isakapatnam Trailer : ఇసకపట్నం ట్రైలర్ రివ్యూ - తండ్రీ కూతుళ్ల మధ్య పవర్ వార్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'ఇది పెద్ద గిఫ్ట్'
ఈ సక్సెస్తో ఆడియన్స్ తనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారని అన్నారు సమంత. 'మా ఇంటి బంగారం రిలీజ్కు ముందు ఒక్క టికెట్ అయినా తెగుతుందా అని భయమేసింది. ఎందుకంటే నా మూవీ వచ్చి మూడేళ్లు అయ్యింది. నా వల్ల కాదని రాజ్ గారికి చెప్పా. జనాలు గుర్తు పెట్టుకుంటారా అని అనుకున్నా. కానీ ఆయన ఒక్క సినిమా చెయ్ అంటూ కన్విన్స్ చేశారు. నాకు సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. మా ఇంటి బంగారం మీ అందరి సినిమా.' అని చెప్పారు.
రివ్యూస్ వల్ల కాదని... ఆడియన్స్ చూసి పాజిటివ్ పోస్టులు పెట్టడం వల్ల ఈ సినిమా నిలబడిందని డైరెక్టర్ నందిని రెడ్డి తెలిపారు. మా ఇంటి బంగారంలో సమంత నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ హైలెట్గా నిలిచాయి.
సమంతతో పాటు దిగంత్, మంజుషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, సీనియర్ నటి లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించగా... ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.
Before You Go
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
ట్రెండింగ్ వార్తలు























