అన్వేషించండి

‘కేరళ స్టోరీ’ వివాదం - పశ్చిమ బెంగాల్ సైతం అదే నిర్ణయం

‘కేరళ స్టోరీ’ సెగ ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం ఈ మూవీ ప్రదర్శన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ మూవీని ప్రదర్శించడానికి కొన్ని థియేటర్లు వెనకడుగు వేస్తున్నాయి. షోను రద్దు చేస్తున్నాయి. అల్లరు జరిగితే థియేటర్లు ధ్వంసం చేస్తారనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు కూడా ఈ మూవీపై బ్యాన్ విధించాయి. తాజాగా ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా చేరింది.  

ANI వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. రాష్టంలో ద్వేషం, హింసాత్మక సంఘటనలు నివారించడానికి, శాంతిని కొనసాగించడానికి ‘ది కేరళ స్టోరీ’ మూవీని నిషేదిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే ‘ది కేరళ స్టోరీ’ కూడా ఒక వర్గాన్ని కించపరిచే చిత్రమేనని, ఇది విక్రీకరించిన కథ అని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నిర్ణయంపై చిత్ర నిర్మాత విపుల్ షా స్పందిస్తూ.. ‘‘మమతా మా మూవీపై నిషేదం విధించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టంలోని నిబంధనల ప్రకారం ఏది సాధ్యమైతే అది చేస్తాం. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడుతాం’’ అని వెల్లడించారు. 

‘ది కేరళ స్టోరీ’లో సున్నితమైన అంశాలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే కారణంతో తమిళనాడులో కూడా ఈ మూవీపై నిషేదం విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని నేరుగా థియేటర్ అసోషియేషన్లే తీసుకోవడం గమనార్హం. తొలుత ఈ మూవీని పలు మల్టిప్లెక్స్‌ థియేటర్లలో ప్రదర్శించారని, అయితే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం, వివిధ వర్గాల నుంచి బెదిరింపులు రావడం తదితర కారణాలతో మూవీ ప్రదర్శన నిలిపేయాలని నిర్ణయించుకున్నారు.  

‘ది కేరళ స్టోరీ’కథ ఏంటంటే?

‘ది కేరళ స్టోరీ’ సినిమాను డైరెక్టర్ సుదీప్తోసేన్‌ రూపొందించారు. కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. 

3 రోజుల్లో రూ.35 కోట్లు వసూళ్లు - త్వరలో ఓటీటీలోకి... 

మే 5, 2023న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అఖండమైన స్పందన వస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కానీ, కొన్ని థియేటర్లు షోస్ నిలిపేస్తుండటంతో నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. దీంతో ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా OTT హక్కులు ఇప్పటికే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Zee5 చేతికి ఓటీటీ రైట్స్?

'ది కేరళ స్టోరీ' మూవీ ఓటీటీ OTT హక్కులను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం జీ 5(Zee5)కొనుగోలు చేసింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ థియేట్రికల్ విడుదలైన 4-6 వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తోంది. అంటే జూన్ మూడవ వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి అరంగేట్రం చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ వెలువడలేదు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fact Check : సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న  షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fact Check : సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న  షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Embed widget