అన్వేషించండి

Shivaji: శోభా వెంటపడటం బాగాలేదు - తేజాకు శివాజీ క్లాస్, నొప్పితో నవ్వుతున్నాని వెల్లడి, కెప్టెన్సీ టాస్క్‌ విజేత అతడే!

‘బిగ్ బాస్’ సీజన్ 7లో శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ నడిచింది. ఈ సందర్భంగా శివాజీ, అమర్ దీప్ మధ్య వాగ్వాదం నెలకొంది.

‘బిగ్ బాస్’ సీజన్-7లో శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ నడిచింది. ఇందులో భాగంగా ఎక్కువ టాస్కులు గెలిచిన జిలేబీపురం టీమ్‌‌కు కెప్టెన్సీ కోసం పోటీపడే అవకాశం వచ్చింది. అయితే, గులాబీపురంలో సభ్యులను ఎంపిక చేసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బిగ్ బాస్.. జిలేబీపురం సభ్యుల ఫొటోలను ఇచ్చి కెప్టెన్‌గా అర్హత లేనివారి పిక్స్‌ను స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలని బిగ్ బాస్ తెలిపాడు. అయితే, శివాజీ జిలేబీపురంలో ఒకరిని స్వాప్ చేసుకోవాలని బిగ్ బాస్ అన్నాడు. అంతా పల్లవి ప్రశాంత్ స్థానంలో శివాజీ వస్తాడని భావించేలోపు భోలే ట్విస్ట్ ఇచ్చాడు. తన స్థానానికి శివాజీ ఇచ్చాడు. 

‘కెప్టెన్’ అర్హతపై లొల్లి

ముందుగా శోభాశెట్టి.. అశ్వినీకి కెప్టెన్‌గా అర్హత లేదని ఆమె ఫొటోను స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. ఆ తర్వాత పూజా మూర్తి.. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. ఈ సందర్బంగా ప్రశాంత్.. పూజాతో వాదించాడు. ‘‘నీకు వచ్చింది అవసరం లేదని నన్ను తీసేస్తున్నావు. నాకు నీ రీజన్ నచ్చలేదు. ప్రాణం పోయేవరకు ఆడుతూనే ఉంటా’’ అని అన్నాడు ప్రశాంత్. ఆ తర్వాత అమర్ దీప్.. శివాజీ ఫొటోను స్విమ్మింగ్ పూల్‌లో వేశాడు. ఈ సందర్భంగా శివాజీ వాదనకు దిగాడు. ‘‘త్యాగం చేసిన వ్యక్తి (భోలే) ప్లేసులో వచ్చాను. ఆయన త్యాగానికి విలువ ఏముంది?’’ అని శివాజీ అన్నాడు. ‘‘ఆయన మీతో ఎక్స్‌ఛేంజ్ చేసుకోడానికి సిద్ధమైనప్పుడు ఓడిపోయాడు’’ అని అన్నాడు. దీంతో శివాజీ తన నోటికి పని చెప్పారు. ‘‘నేను వేస్ట్ క్యాండిటేట్‌లా కనిపిస్తున్నా. నువ్వు ఫెయిర్ గేమ్ ఆడలేదు’’ అని శివాజీ అన్నాడు. ‘‘మీరు చెప్పిన తర్వాత నుంచి నేను ఫెయిర్ గేమ్ ఆడుతున్నా’’ అని అమర్ దీప్ అన్నాడు. ‘‘నువ్వు ఫెయిర్ గేమ్ ఆడానని చెప్పకు. నవ్వుతారు’’ అని అమర్‌దీప్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ‘‘నేను ఈ హౌస్‌లో పనికి రాను’’ అంటూ మైకును తీసి పక్కన పెట్టేశాడు. ‘‘నాకు చెయ్యి బాగోకపోయినా వారితో, వీరితో గొడవపడి పరిగెట్టాను. అది కాదా ఫిజికల్. మీరు ఆడే ఆటలే ఫిజికలా? ఆదిలోనే నన్ను తొక్కేస్తున్నారు. నేను పల్లవి ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్ చేశా. అంటూ అలిగాడు శివాజీ. ఆ తర్వాత అమర్‌దీప్.. శివాజీ, యావర్, ప్రశాంత్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీకు మీవాళ్లు ఎంత ఇంపార్టెంట్‌ అనిపించారో. నాకు నా వాళ్లు అంత ఇంపార్టెంట్’’ అనిపిస్తుంది కదా అని అమర్‌దీప్ అన్నాడు. చివరికి కెప్టెన్సీ పోటీదాలుగా సందీప్, అర్జున్ ఎంపికయ్యారు. 

శోభాశెట్టితో తిరగడం బాగోలేదు: తేజాకు శివాజీ క్లాస్

శోభాశెట్టికి, తేజాకు మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన కంటెస్టెంట్ల విషయంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా శోభా.. తేజాపై అరిచింది. ఆ తర్వాత తేజా బయటకు వెళ్లి బాల్కానీలో శివాజీతో కూర్చున్నాడు. దీంతో శివాజీ తేజాకు హితబోధ చేశాడు. ‘‘నువ్వు శోభాశెట్టి వెంటపడి తిరగడం బాగోలేదు. ఆమె కంటెంట్ కోసం రెచ్చిపోతుంది’’ అని తెలిపాడు. కాస్త ఆమెకు దూరంగా ఉంటూ ఇతరులతో కూడా కలిసి ఉండు. అప్పుడు కంటెంట్ దొరకదన్నట్లుగా తేజాకు చెప్పాడు. అయితే, తేజా అవేవీ బుర్రకు ఎక్కించుకోలేదు. కొద్ది సేపు ఆమెతో చిర్రుబుర్రులాడుతూ.. చివరికి శోభా వెంటే తిరిగాడు. 

నొప్పిని భరించి నవ్వుతున్నా: శివాజీ

చెయ్యి నొప్పితో బాధపడుతున్న శివాజీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘చెయ్యి నొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నా. నేను ఎవరికీ భయపడను. ఉంటే ఉంటా.. పోతే పోతా. పిల్లలతో మాటలు పడటం ఇబ్బందిగా ఉంది. అన్నీ ఉన్నాయి కానీ, ఆటకు న్యాయం చేయలేకపోతున్నా. నేను చాలా ఆశలతో వచ్చా ఇక్కడికి. టైమ్ పడుతుంది. నా బాడీ కోఆపరేట్ చేయడం లేదు. నాకు గొంతు ఉంది. దానితో కూడా భయపెట్టగలను. కానీ, అది న్యాయం కాదు. నాకు మీరు ఇచ్చిన సంచాలక్‌కు కూడా నూరు శాతం న్యాయం చేశా. వాళ్ల అందరి ముందు ఏడ్వలేకపోతున్నా. బరువుగా ఉంది లోపల. నేను లక్ష మందికి సమాధానం ఇస్తా. నేను ఉంటే కప్పు కొడతా అని తెలుసు. చాలా బాగా స్టార్ట్ చేశా. నొప్పిని భరించి నవ్వుతున్నా’’ అని  దనువ్వు ఆడలేదు అని పరోక్షంగా అన్నారు. డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం అని బిగ్ బాస్ తెలిపాడు. 

కెప్టెన్‌గా అర్జున్

‘బిగ్ బాస్’ లైవ్ ప్రకారం.. అర్జున్ అంబాటీ కెప్టెన్‌గా నిలిచాడు. టాస్క్‌లో భాగంగా సందీప్, అర్జున్ కళ్లకు గంతలు కట్టి.. CAPTAIN స్పెల్లింగ్‌కు అక్షరాలను కరెక్టుగా అమర్చాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ఇద్దరూ పోటాపోటీగా ఈ టాస్క్‌లో పోటీపడ్డారు. చివరికి అర్జు్న్ పైచేయి సాధించి ఇంటికి కెప్టెన్ అయ్యాడు.

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget