News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chris Hemsworth: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్‌ వెల్లడి, RRRపై ప్రశంసలు

‘RRR’ చిత్రంపై మరో హాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందన్న ఆయన, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు.

FOLLOW US: 
Share:

ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఈ చిత్రం భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్టులో చేరారు క్రిస్ హేమ్స్ వర్త్. సినిమా అద్భుతం అన్న క్రిస్, చెర్రీ, జూనియర్ తో కలిసి పని చేయాలని ఉందన్నారు.    

‘RRR’పై మార్వెల్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ ప్రశంసల వర్షం

థోర్ పాత్రతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న మార్వెల్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘RRR’ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇండియా పై ఉన్న ప్రత్యేక అభిమానం గురించి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హేమ్స్ వర్త్‌కు ఇండియా అంటే చాలా అభిమానం. తన కూతురురికి ఆయన ఇండియా అనే పేరును పెట్టాడు. ఇండియాలో తనకు ఉన్న అభిమానుల గురించి తెలిసి కూతురుకు ఆ పేరును పెట్టాడట. అది వాస్తవమేనని తాజాగా ఆయన వెల్లడించారు. “ఇటీవల నేను ‘RRR’ సినిమా చూశాను. అది ఒక అద్భుతమైన చిత్రం. వండర్ ఫుల్ అనే ఫీలింగ్ కలిగింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ బాగుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన నన్ను ఆకట్టుకుంది. వారితో కలిసి పని చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అంతేకాదు, వారితో కలిసి పని చేసే అవకాశం వస్తే నేను లక్కీగా ఫీలవుతాను” అని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇండియన్ స్టార్స్ గురించి మాట్లాడని హేమ్స్ వర్త్, తొలిసారి ‘RRR’ స్టార్స్ గురించి మాట్లాడ్డం ఆసక్తి కలిగిస్తోంది.

విప్లవ వీరుల స్పూర్తితో తెరకెక్కిన ‘RRR’ చిత్రం

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లాంటి ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో అల్లుకున్న కల్పిత కథతో ‘RRR’ చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. భీమ్ గా తారక్, రామరాజుగా చరణ్ నటించారు. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియా సరన్, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ సినిమాలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. క్రిస్ హేమ్స్‌ వర్త్ నటించిన ‘ఎక్స్‌ ట్రాక్షన్ 2’ జూన్ 16 నాడు నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రీమియర్ అవుతుంది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix US (@netflix)

Read Also: సోషల్ మీడియాకు కాజోల్ గుడ్ బై, వెళ్తూ వెళ్తూ కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ

Published at : 09 Jun 2023 03:31 PM (IST) Tags: RRR Movie Jr NTR Ram Charan Actor Chris Hemsworth

ఇవి కూడా చూడండి

Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్‌కు అలహాబాద్ హైకోర్టు షాక్, గుట్కా కేసులో ముగ్గురికి నోటీసులు

Gutka Advertisements: బాలీవుడ్ స్టార్స్‌కు అలహాబాద్ హైకోర్టు షాక్, గుట్కా కేసులో ముగ్గురికి నోటీసులు

Tripti Dimri - Sara Ali Khan: 'యానిమల్'లో సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు? - అసలు నిజం ఏమిటంటే?

Tripti Dimri - Sara Ali Khan: 'యానిమల్'లో సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు? - అసలు నిజం ఏమిటంటే?

Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు

Rashmika Mandanna: అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన రష్మిక - 'యానిమల్'లో నటనకు బిగ్ బి ప్రశంసలు

Vidyut Jamwal: హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో - ప్రతి ఏడాదీ 10 రోజులు ఇలా న్యూడ్‌గా

Vidyut Jamwal: హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో - ప్రతి ఏడాదీ 10 రోజులు ఇలా న్యూడ్‌గా

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

టాప్ స్టోరీస్

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?