అన్వేషించండి

Assembly Elections 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!

Assembly Elections 2026: కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 296 స్థానాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
  • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య, అస్సాంలో ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య పోరు.
  • పుదుచ్చేరిలో 30 స్థానాలకు 284 మంది అభ్యర్థులు, కూటముల మధ్య పోటీ.
  • మే 4న ఎన్నికల ఫలితాలు, జాతీయ స్థాయిలో కూటముల బలాబలాలను నిర్ధారిస్తాయి.

Assembly Elections 2026: కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7  గంటల నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. 

కేరళలో ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ మధ్య పోరు 

కేరళ రాష్ట్రంలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్ంట్, యునైటెడ్‌ డెమోక్రటిక్ ఫ్రంట్‌ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోరు నెలకొంది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఎల్డీఎఫ్‌ 99 స్థానాలను కైవసం చేసుకొని స్పష్టమైన మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ నేతృతవంలోని యూడీఎఫ్‌ 41 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఈసారి అధికార మార్పిడి జరుగుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. 

అస్సాంలో ఎన్డీఏ కోట భద్రమేనా?

అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా బీజేపీ కూటమిగా బరిలోకి దిగింది. వారిని ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ కలిపి ఇండీ అలియన్స్‌గా బరిలోకి దిగి గట్టి పోటీని ఇచ్చాయి. అస్సాం రాజకీయ ముఖచిత్రంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. 

పుదుచ్చేరిలో పాగా వేసేది ఎవరు?

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది ఇక్కడ మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పుదుచ్చేరి ప్రాంతంలో 23, కారైక్కాల్‌లో 5 మహే, యానాంలో ఒక్కో స్థానం ఉంది. ఈ 30 స్థానాల కోసం మొత్తం 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు 34 మంది ఉన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, బీజేపీ కూటమి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. ఎన్‌ రంగస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా ఆ రెండు పార్టీలు మిత్ర పక్షాలుగా బరిలోకి దిగాయి. వీరిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి కూటమిగా పోటీ చేస్తున్నాయి. 

నిఘా నీడలో మూడు ప్రాంతాలు 

ఎన్నికల కమిషన్ ఈ మూడు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంమైన ఓటింగ్ సాయంత్రం వరకు సాగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల అంటే మే 4వ తేదీ వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, జాతీయ స్థాయిలో కూటముల బలాబలాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగే కేంద్రాలకు వస్తుండటంతో, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పుదుచ్చేరీ వంటి ప్రాంతాల్లో స్వతంత్రులు, ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ జాతీయ పార్టీల కూటములు మధ్యే ప్రధాన పోరు కనిపిస్తోంది.            

Frequently Asked Questions

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎప్పుడు ప్రారంభమైంది?

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

కేరళలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మరియు ప్రధానంగా ఏ కూటముల మధ్య పోరు నెలకొంది?

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మరియు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మధ్య పోరు నెలకొంది.

అస్సాంలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది?

అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

పుదుచ్చేరిలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మరియు ఎన్ని నియోజకవర్గాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి?

పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో పుదుచ్చేరి ప్రాంతంలో 23, కారైక్కాల్‌లో 5, మహే మరియు యానాంలో ఒక్కో స్థానం ఉన్నాయి.

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల అంటే మే 4వ తేదీన వెలువడనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget