అన్వేషించండి

First Phase Election Notification: లోక్‌సభ ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదల-ఈనెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్‌ విడుదలైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Lok Sabha Elections 2024 First Phase Notification: ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. లెజిస్లేటివ్ కౌన్సెల్ జాయింట్‌ సెక్రటరీ దివాకర్‌ సింగ్‌ పేరుతో  ఇవాళ (బుధవారం) ఉదయం ఒక గెజిట్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌తో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలివిడతలో భాగంగా... 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని... 102 ఎంపీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్‌  విడుదల కావడంతో.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లేనని ఈసీ ప్రకటించింది. తొలి నోటిఫికేషన్‌కు సంబంధించి... ఇవాళ్టి (మార్చి 20వ తేదీ) నుంచి ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.  ఈనెల 30 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ జరగనుంది.ఫలితాలు జూన్‌ 4వ తేదీన అన్ని దశల ఎన్నికల ఫలితాలతో పాటే విడుదల కానున్నాయి. 

తొలి విడత ఎన్నికలు ఎక్కడెక్కడ..?
తొలివిడతలో.. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని... 102 ఎంపీ స్థానాలకు జరుగుతున్నాయి. వీటిలో... తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8 స్థానాలకు తొలివిడతలో పోలింగ్‌ జరగనుంది. అలాగే మధ్యప్రదేశ్‌లోని 6,   మహారాష్ట్రలో ఐదు, ఉత్తరాఖండ్‌లో ఐదు, అసోంలోని ఐదు స్థానాలు కూడా తొలివిడతలోనే ఎన్నికల జరుగుతున్నాయి. ఇక... బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు, మణిపుర్‌లో రెండు, మేఘాలయలలో రెండు  స్థానాలకు కూడా ఫస్ట్‌ ఫేజ్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. చివరగా... ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానానికి తొలివిడతలో పోలింగ్‌  జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలు.. సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా(ఎస్సీ), మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ లోకసభ స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి.  ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు.... ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్‌ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 44 రోజులపాటు పోలింగ్‌ జరగబోతోంది. 

దేశంలో ఎన్నికల సందడి
తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో... దేశంలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది..మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు  జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలిదశ పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ విడుదలకావడంతోపాటు... నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకావడంతో... దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కనిపించనుంది. 1951-52లో జరిగిన  తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే కావడం కూడా ఒక ప్రత్యేకత. 102 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్‌ రావడంతో... ఆయా ప్రాంతాల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు  ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లె సీఈసీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ ఉంటుంది. తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు కూడా మే 13నే ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడతాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

వీడియోలు

Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Tegalu Health Benefits : తేగలతో అద్భుత ప్రయోజనాలు.. డిటాక్స్ నుంచి వెయిట్ లాస్ వరకు ఆరోగ్య లాభాలు ఇవే
తేగలతో అద్భుత ప్రయోజనాలు.. డిటాక్స్ నుంచి వెయిట్ లాస్ వరకు ఆరోగ్య లాభాలు ఇవే
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Embed widget