అన్వేషించండి

టీడీపీ నుంచి గంటాను పొమ్మనలేక పొగబెడుతున్నారా..?

Ganta Srinivas Rao: గంటా భీమిలి, ఉమ్మడి విశాఖలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తుంటే.. అధినాయకత్వం చీపురుపల్లి వెళ్లాలనడం పొమ్మనలేక పొగపెట్టడమేనని టాక్ నడుస్తోంది.

Ganta Srinivasrao Situation In Tdp : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయాల్లో ఓటమన్నదే తెలియదు. 1999 నుంచి ఇప్పటి వరకు వరుస ఎన్నికల్లో గెలుస్తూనే వస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన రాజకీయాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014 వరకు గంటా వర్గంలో నలుగురు వరకు ఎమ్మెల్యేలు ఉండేవారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన గంటా శ్రీనివాసరావుకు గడిచిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత నుంచి పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ గంటా విశాఖ నార్త్‌ నుంచి విజయం సాధించారు. టీడీపీ ఓటమిపాలు కావడంతో రాజకీయంగా ఆయన సైలెంట్‌ అయిపోయారు. సుమారు మూడేళ్లపాటు రాజకీయగా మౌనం దాల్చిన గంటా.. ఆ తరువాత వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ముహూర్తం కూడా ఫిక్స్‌ అయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకప్పుడు కలిసి రాజకీయాలు చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాసరావు రాకకు బ్రేకులు వేసినట్టు చెబుతారు. ఆ తరువాత ఆయన మరికొన్నాళ్లు మౌనం దాల్చారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయన రాజకీయంగా యాక్టివ్‌ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాయానికి వెళ్లడంతోపాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ తరువాత అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన గంటా.. పార్టీ కార్యాలయంలో వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరింత యాక్టివ్‌ అయ్యారు.

కష్టకాలంలో దూరంగా ఉన్నారన్న భావన

గంటాకు రాజకీయంగా జీవితాన్ని ఇవ్వడంతోపాటు 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు.  2019లో అధికారాన్ని కోల్పోయిన తరువాత గంటా పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా లేరన్న భావన స్థానిక నాయకులతోపాటు అగ్ర నాయకుల్లోనూ ఉంది. గంటా మళ్లీ పార్టీలో యాక్టివ్‌ కావడాన్ని చంద్రబాబు కూడా అంగీకరించలేదని, కానీ, ఆయన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణ కారణంగా చంద్రబాబు అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. అయినప్పటికీ అగ్ర నేతలకు గంటాపై సానుకూల అభిప్రాయం లేదని, ముఖ్యంగా గంటా అంటే ముందు నుంచీ వ్యతిరేకించే విశాఖకు చెందిన కొందరు నేతలు అగ్రనేతలకు ఆయన గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కారణాలతోనే గంటాను పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టే రీతిలో అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంటాకు సంబంధం లేని, సుదూర ప్రాంతంలో ఉన్న చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేయమంటున్నట్టు చెబుతున్నారు. గంటా కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ నుంచి తనను పంపించేయాలనుకుంటున్నారా..? అంటూ గంటా చేసిస వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఆసక్తిని కలిగిస్తున్నాయి.  

ప్రజారాజ్యంలోకి వెళ్లిన గంటా

గంటా తనకు ఉన్న అవకాశాలను పార్టీ మారుతుంటారన్న భావన పార్టీ ముఖ్య నాయకుల్లో ఉంది. గతంలో 2009లో తన అనుచరులతో కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం పార్టీ చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత.. అక్కడ మంత్రివర్గంలో చేరారు. ఆ తరువాత 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో మంత్రివర్గంలో చేరారు. 2019 వరకు మంత్రిగా పని చేసిన గంటా.. అధికారాన్ని పార్టీ కోల్పోవడంతో రాజకీయంగా సైలెంట్‌ అయిపోయారు. మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో యాక్టివ్‌ అయ్యారని పార్టీ అగ్ర నాయకులు భావిస్తున్నారు. పార్టీయే గంటాకు ఉపయోగపడింది తప్పా.. పార్టీకి గంటా ఎప్పుడూ ఉపయోగపడలేదని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. ఈ ఉద్ధేశంతోనే గంటాను విశాఖకు దూరంగా చీపురుపల్లికి పంపిస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా ఆయన మళ్లీ పార్టీలో యాక్టివ్‌ కావడం తెలుగుదేశం పార్టీ కీలక నాయకులకు ఇష్టం లేదని, తన వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణ ఒత్తిడితో చంద్రబాబు అంగీకరించారని చెబుతున్నారు. గంటా భీమిలి గానీ, ఉమ్మడి విశాఖలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తుంటే.. అధినాయకత్వం మాత్రం చీపురుపల్లి వెళ్లాలని చెప్పడం వెనుక కూడా గంటాను పొమ్మనలేక పొగపెట్టడమేనని చెబుతున్నారు. గెలిస్తే బొత్స వంటి సీనియర్‌ నేతకు చెక్‌ చెప్పినట్టు అవుతుందని, ఓడితే గంటాకు రాజకీయంగా చెక్‌ చెప్పినట్టు అవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, చీపురుపల్లి వెళ్లను అంటే ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని గంటాకు చూపిస్తారా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
Keralam CM VD Satheesan: కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
  VIjay Silence:మూడు రోజులుగా విజయ్ మౌనం.. ముఖ్యమంత్రిగానే మాట్లాడతాడా..?  ఈ సైలెన్స్‌కు అర్థమేంటి..?
మూడు రోజులుగా విజయ్ మౌనం.. ముఖ్యమంత్రిగానే మాట్లాడతాడా..?  ఈ సైలెన్స్‌కు అర్థమేంటి..?

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Embed widget