అన్వేషించండి

Telangana Politics : లోక్‌సభ బరి నుంచి సీపీఎం విరమణ - కాంగ్రెస్ పార్టీకి మద్దతు

Telangana CPM : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ,సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు.

Revanth Reddy Meet Tammineni Veerabhadram :  తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయించుకుంది. సీపీఎం ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేసిపిఎం ముఖ్య నేతలు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.  లోక్ సభ స్థానాల్లో మద్దతివ్వాలని సిపిఎం నేతలను రేవంత్ రెడ్డి కోరినట్లు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు.  అభ్యర్థులను విరమించుకోవాలని సీఎం కోరారు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  బీజేపీ, ఇతర శక్తులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. ముఖ్యమంత్రితో పాటు ఇతర నాయకులతో చర్చించామన్నారు. 

సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తమ్మినేని వీరభద్రంను కోరిన రేవంత్ రెడ్డి                                             

భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టామని..  బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారన్నారు.  దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని రేవంత్ గుర్తు చేశారు.  ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా... అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు.  సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళతామని ప్రకటించారు.  ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నానన్నారు. 

ఇప్పటికే మద్దతు ప్రకటించిన  సీపీఐ                                  

కమ్యూనిస్టుల్లో మరో పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్ కు  మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ కలసి పోటీ చేశాయి. అయితే సీపీఐకి ఒక్కటంటే ఒక్క స్థానమే కేటాయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త గూడెం కేటాయించడంతో అక్కడ సీపీఐ గెలిచింది. కానీ తమకు కూడా ఒక్క సీటే కేటాయిస్తామని చెప్పడంతో .. సీపీఎం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోలేదు. విడిగానే  పోటీ చేసింది. బలం ఉన్న చోటల్లా పోటీ చేసినా.. స్వయంగా తమ్మినేని  వీరభద్రం పోటీ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. 

జాతీయ స్థాయిలో కూడా కలసి పని చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు     

అయితే సీపీఎం అభ్యర్థుల వల్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరుగుతుందన్న భావనతో  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేస్తున్న కమ్యూనిస్టులతో మాట్లాడాలని నిర్ణయించుకన్నారు. అందుకే తమ్మినేని వీరభద్రంను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కొంత ఓటు  బ్యాంక్ ఉన్న సీపీఎం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత మేర ఓట్లు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
Embed widget