అన్వేషించండి

మునుగోడులో 130 మంది నామినేషన్లు- అసంతృప్తులను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు

మునుగోడులో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చాలా మంది పోటీకి సై అన్నారు.

మునుగోడు బైపోల్‌ ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టం ముగిసింది. శుక్రవారంతో నామినేషన్‌ దాఖలు గడువు పూర్తైంది. ఇప్పటి వరకు 130 మంది అభ్యర్థులు, 199 సెట్ల నామినేషన్లు వేశారు. శుక్రవారం ఒక్కరోజే 74 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఇప్పుడు వాటిని స్క్రూట్నీ చేసే పనిలో అధికారులు ఉన్నారు. 

మునుగోడులో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చాలా మంది పోటీకి సై అన్నారు. ఇప్పడున్న పార్టీలపై కోపంతో కొందరు... తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరికొందరు... ప్రభుత్వంపై కోపంతో ఇంకొందరు నామినేషన్లు వేశారు. అందుకే సుమారు రెండు వందల వరకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 2018 ఎన్నికల్లో 33 మంది మాత్రమే నామపత్రాలు దాఖలు చేశారు. స్క్రీట్నీ, బుజ్జగింపుల తర్వాత బరిలో నిలిచింది 15 మందే. ఇప్పుడు ఎంత మంది నిలుస్తారన్నది సస్పెన్ష్‌గా మారింది. 

ప్రధాన పార్టీలను పరిశీలిస్తే.. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, టీఆరెఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాలుగు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అధికారులకు ఇచ్చారు.  వీరితోపాటు డిండి రిజర్వాయర్ భూ నిర్వాసితులు, నిరుద్యోగులు, వివిధ ప్రజాసంఘాల నేతలు పోటీకి సై అన్నారు. కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టిన లెంకల పల్లి గ్రామం నుంచి కూడా నామినేషన్లు పడ్డాయి. ఓయూ జేఏసీ నాయకుడు ఏర్పుల నగేష్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు ఇచ్చారు.  

ఇంత మంది నామినేషన్ వేయడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారనుంది. ఆల్ఫాబేట్‌ ప్రకారం అభ్యర్థుల పేర్లు ఈవీఎంపై రానున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎక్కడో మధ్యలోనో చివరిలోనో కనిపిస్తారు. వాళ్లను వెతుక్కోవడం చాలా కష్టంగా మారనుంది. 

వీళ్లకు కేటాయించిన గుర్తులతో కూడా ప్రధాన పార్టీలకు చిక్కొచ్చి పడనుంది. ప్రధాన పార్టీలకు పోలిన గుర్తులు వస్తే మాత్రం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి తాము వేయాల్సిన అభ్యర్థికి కాకుండా వేరే గుర్తుపై ఓటు వేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌ను కలిసి తమ కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

ఇలాంటి బెడద లేకుండా ఉండేలా ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన వారిలో చాలా మందిని తప్పుకునేలా ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వారు నామినేషన్ దాఖలు చేయడానికి గల ప్రధాన కారణాన్ని తెలుసుకొని వాటిని తామే పరిష్కరిస్తామని బుజ్జగించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 

ప్రధాన పార్టీల్లో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నా అధికార పార్టీకి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. అందుకే ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న  చాలా వర్గాలు మునుగోడులో పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేశాయి. అందులో లారీ ఓనర్స్‌ అసోసియేషన్, వీఆర్‌ఏలు ఉన్నారు. వారిని ప్రభుత్వం, టీఆర్‌ఎస్ అధిష్ఠానం బుజ్జగించింది. మునుగోడులో వాళ్లు పోటీ చేయకుండా వారి సమస్యల పరిష్కారానికి ప్రధాన్యత ఇస్తామంటూ హామీ ఇచ్చింది. డిండీ ప్రాజెక్టు నిర్వాసితులు ఇప్పుడు బరిలో ఉన్నారు. వారిని ఒప్పించి బరి నుంచి తప్పించేందుకు అధికార పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
Keralam CM VD Satheesan: కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Embed widget