అన్వేషించండి

FCRI Admissions: బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

FCRI Hyderabad: ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్‌తోపాటు ఎప్‌సెట్ పరీక్షలో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

FCRI Hyderabad BSc Admissions 2024: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమీపంలోని ములుగులో ఉన్న "ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Forest College and Research Institute(FCRI), Hyderabad at Mulugu)" నాలుగేళ్ల బీఎస్సీ(హానర్స్‌) ఫారెస్ట్రీ (B.Sc. Hons. Forestry) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌తోపాటు టీఎస్ ఎప్‌సెట్-2024 (TS EAPCET) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు ఈ కోర్సుకు అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 6న ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్న విద్యార్థులు జూన్‌ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 30న దరఖాస్తులు సవరించుకోవచ్చు. మొత్తం సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఇక పేమెంట్ కోటా కింద ప్రవేశాలు కోరువారు రూ.3000 ఫీజు చెల్లించాలి. ప్రవేశాలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 8074350866, 9666460939 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల తొలి మెరిట్ జాబితాను జులై 2న ప్రకటించి, జులై 8న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జులై 9న తొలివిడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 16లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థుల సీట్ల కేటాయింపు రెండో మెరిట్ జాబితాను జులై 20న ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు జులై 26లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక చివరగా అభ్యర్థుల సీట్ల కేటాయింపు మూడో మెరిట్ జాబితాను జులై 29న ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు ఆగస్టు 5లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని విడతలు పూర్తయిన తర్వాత పేమెంట్ కోటా అభ్యర్థుల జాబితాలను ఆగస్టు 12న ప్రకటించనున్నారు. విద్యార్థులకు ఆగస్టు 12 నుంచి ఓరియంటేషన్ తరగతులు ప్రారంభంకానున్నాయి. కళాశాలలో రిజిస్ట్రేషన్‌కు కూడా ఆగస్టు 12 చివరితేదీగా నిర్ణయించారు.

కోర్సు వివరాలు..

* బీఎస్సీ(హానర్స్) ఫారెస్ట్రీ ప్రవేశాలు - 2024

అర్హత: ఇంటర్ అర్హతతోపాటు ఎప్‌సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: తెలంగాణ ఎప్‌సెట్-2024 ర్యాంకు ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు.  

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ కోటా కింద ప్రవేశాలు కోరువారు రూ.3000 ఫీజు చెల్లించాలి. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 27.06.2024. (5:00 PM)

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.06.2024.

➥ అభ్యర్థుల మెరిట్ జాబితా వెల్లడి: 02.07.2024.

➥ మొదటి విడత కౌన్సెలింగ్/ప్రవేశాలు (అన్ని కేటగిరీలు): 08.07.2024.

➥ మొదటివిడత సీట్ల కేటాయింపు: 09.07.2024.

➥ మొదటివిడత ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చివరితేది: 16.07.2024.

➥ సీట్ల కేటాయింపు రెండో జాబితా వెల్లడి: 20.07.2024.

➥ రెండో విడత ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చివరితేది: 26.07.2024.

➥ సీట్ల కేటాయింపు మూడో జాబితా వెల్లడి: 29.07.2024.

➥ రెండో విడత ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చివరితేది: 05.08.2024.

➥ పేమెంట్ కోటా తుది జాబితా ప్రకటన: 12.08.2024.

➥ ఓరియంటేషన్, రిజిస్ట్రేషన్: 12.08.2024.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
First Pan India Movie: సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డు... రజనీ, నాగార్జున హీరోలు... ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?
సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డు... రజనీ, నాగార్జున హీరోలు... ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా?
Telugu Serial Actress: గుడ్ న్యూస్ షేర్ చేసిన పద్మిని, అజయ్... పండంటి బిడ్డకు జన్మ ఇచ్చిన వైదేహి పరిణయం సీరియల్ నటి
గుడ్ న్యూస్ షేర్ చేసిన పద్మిని, అజయ్... పండంటి బిడ్డకు జన్మ ఇచ్చిన వైదేహి పరిణయం సీరియల్ నటి
Ban On Medicine: పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, బరిలో నిలిచేది ఎవరో..
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, బరిలో నిలిచేది ఎవరో..
Embed widget