అన్వేషించండి

PM e-Vidya: వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్.. హైక్వాలిటీ కంటెంట్‌తో 200 టీవీ ఛానెళ్లు.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపు ఇదీ..

ఈ వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం విద్య బోధించేందుకు ఉన్న 12 చానళ్లను ఏకంగా 200కు పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

మారుతున్న కాలం, పరిస్థితులకు తగ్గట్లుగా భారత్‌లో డిజిటల్ విద్యకు మరింత పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకోసం ‘వన్‌ క్లాస్‌- వన్‌ టీవీ ఛానల్‌’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం విద్య బోధించేందుకు ఉన్న 12 చానళ్లను ఏకంగా 200కు పెంచుతామని ప్రకటించారు. ఇది కనుక ఆచరణలోకి వస్తే ఇకపై అన్ని తరగతులకూ ప్రాంతీయ భాషలో ఒకేసారి డిజిటల్‌ విద్యాబోధన జరుగుతుందని భావిస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియోలు, డిజిటల్ టీచర్ల ద్వారా అన్ని భాషల్లో హై క్వాలిటీతో కూడిన ఇ-కంటెంట్‌ను అందిస్తామని నిర్మల సీతారామన్ వివరించారు.

అయితే దేశంలో ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు 12 చానళ్ల ద్వారా మాత్రమే డిజిటల్‌ తరగతులు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క టీ శాట్ అనే ఛానల్ ద్వారా ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో రోజుకు రెండు, మూడు తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఛానళ్ల సంఖ్యను 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 200కు పెంచుతామని ప్రకటించడంతో ఈ సమస్య తీరిపోయే అవకాశం ఉంచవచ్చని భావిస్తున్నారు. డిజిటల్‌ తరగతులకు స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ బోర్డు కూడా ఉండాలి. ఇందుకు ఒక్కో బోర్డుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 

డిజిటల్ యూనివర్సిటీ కూడా..
డిజిటల్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు వారి ఇంటి వద్దకే ప్రపంచస్థాయి విద్యను అందిస్తామని నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. వేర్వేరు ప్రాంతీయ భాషలు, ఐసీటీ ఫార్మట్స్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. 

వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పు.. కమిటీ
వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్‌ను సవరించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త పాఠ్యాంశాల్లో జీరో బడ్జెట్ వ్యవసాయం, సహజ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం, వాల్యూ అండ్ మేనేజ్మెంట్ వంటి అంశాలను కొత్తగా చేర్చనున్నట్లు తెలిపారు. సిలబస్ మార్పుల కోసం ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించనున్నారు.

ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మేకిన్ ఇండియా ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs LSG Match Highlights IPL 2025 | సంచలన రీతిలో లక్నోపై గెలిచేసిన ఢిల్లీ | ABP DesamSunita Williams Return to Earth | నాసాకు కూడా అంతు చిక్కని Communication Blackout  | ABP DesamMS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Embed widget