అన్వేషించండి

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కారణమిదే!

. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడం, ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు లభించనందున కౌన్సెలింగ్ వాయిదా పడింది.

ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడం, ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు లభించనందున కౌన్సెలింగ్ వాయిదా పడింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్లకు గడువు సెప్టెంబరు 5తో ముగిసింది. 


అయితే ఇప్పటి వరకు లక్షమందికిపైగా విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు రెండు, మూడు రోజుల్లో సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేయనుంది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతుల ఉత్తర్వులు విడుదలైన తర్వాత ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం వెబ్ ఐచ్ఛికాలకు అవకాశం కల్పిస్తారు.


ఈఏపీసెట్‌లో ఎన్‌సీసీ, దివ్యాంగులు, సైనికోద్యోగులు, క్రీడల కోటా అభ్యర్థులకు సెప్టెంబరు 8న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రత్యేకంగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ లోని సహాయ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.


ఇంజినీరింగ్ కాలేజీలకు ఉన్నత విద్యాశాఖ అనుమతులను పునరుద్ధరించకపోవడంతో ఏపీ ఈఏపీ సెట్‌ కౌన్సిలింగ్‌ వాయిదా పడింది. ఉన్నత విద్యాశాఖ అనుమతులు, యూనివర్శిటీల అఫిలియేషన్ కొలిక్కి రాకపోవడంతో కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈఏపీ సెట్‌ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేయడానికి గడువు ముగిసినా కౌన్సిలింగ్ నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.


ఏపీఈఏపీసెట్‌ ద్వారా కాలేజీలలో అడ్మిషన్ల కోసం దాదాపు లక్ష మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీలను ఎంచుకునేందుకు రెండు, మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించనున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు మంజూరైన తర్వాత విద్యార్ధులు కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాలేజీలకు అనుమతులు వచ్చిన తర్వాత వెబ్‌ ఆప్షన్ విండో ఓపెన్ అవుతుందని చెబుతున్నారు.


ఏపీఈఏపీసెట్‌లో ఎన్‌సీసీ, దివ్యాంగులు, సైనికోద్యోగులు, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్ధులకు సెప్టెంబర్ 8 నుంచి ధృవపత్రాలను పరిశీలించనున్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల వినతితో వారికి కూడా వెరిఫికేషన్ అవకాశం కల్పిస్తున్నారు. విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్దుల సహాయ కేంద్రంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ప్రకారం నెలాఖరు వరకు జరుగనుంది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి విద్యార్థులకు సీట్లను కేటాయించాల్సి ఉన్నా వాయిదా వేశారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్ధులు ఈఏపీ సెట్‌కు హాజరయ్యారు. వారిలో 1,73,572 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్ధులకు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కాలేజీల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌‌కు హాజరయ్యేందుకు ఈ ఆగస్టు 30 వరకు విద్యార్థుల నుంచి ప్రాసెసింగ్ ఫీజును స్వీకరించారు. ఆగస్టు 23 నుంచి 31 వరకు తొలి విడత సర్టిఫికెట్లను పరిశీలన చేశారు. ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. విద్యార్థులకు సెప్టెంబర్ 6న కళాశాలల్ని కేటాయిస్తే సెప్టెంబర్ 12లోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని మొదటి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. సెప్టెంబర్‌ 12 నుంచి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా కౌన్సిలింగ్ వాయిదా నేపథ్యంలో తరగతులు కూడా ఆలస్యం కానున్నాయి.

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టులో షాక్... చెక్ బౌన్స్ కేసులో మూడు నెలలు జైలు శిక్ష
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టులో షాక్... చెక్ బౌన్స్ కేసులో మూడు నెలలు జైలు శిక్ష
Telangana News: పటాన్ చెరు కాంగ్రెస్‌లో లొల్లి- మహిపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు
పటాన్ చెరు కాంగ్రెస్‌లో లొల్లి- మహిపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు
Rohit Sharma: అదే కథ.. అదే వ్యథ.. రంజీల్లోనూ విఫలమైన రోహిత్.. కెరీర్ కు ముప్పు తప్పదా..?
అదే కథ.. అదే వ్యథ.. రంజీల్లోనూ విఫలమైన రోహిత్.. కెరీర్ కు ముప్పు తప్పదా..?
RRB Group D Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరి తేదీ ఎప్పుడంటే?
రైల్వేలో 32,438 గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరి తేదీ ఎప్పుడంటే?
Embed widget