అన్వేషించండి

Andhra University : ఏయూకి అరుదైన గుర్తింపు - ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన న్యాక్ !

Andhra University : ఆంధ్రా యూనివర్శిటీకి న్యాక్ డబుల్ ఏ ప్లస్ గుర్తింపు ఇచ్చింది. ఈ గుర్తింపు ప్రతిష్టాత్మకమని వీసీ ప్రసాదరెడ్డి తెలిపారు.

 

Andhra University :  ఆంధ్ర విశ్వవిద్యాలయానికి న్యాక్‌ ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ ప్రకటించింది. ఈనెల మొదటి వారంలో ఏడుగురు సభ్యుల గల న్యాక్‌ బృందం ఏయూలో పర్యటించింది. ఈ మేరకు వారం వ్యవధిలోనే గ్రేడ్‌ను ప్రకటించింది.  2005 నుంచి న్యాక్‌ దేశంలో వివిధ విద్యా సంస్థల గ్రేడ్‌ను ప్రకటిస్తూ వస్తోంది. చివరిసారిగా 2016లో ప్రకటించింది. మధ్యలో కొవిడ్‌ కారణంగా రెండేళ్లు ప్రకటించలేదు. ఈ గ్రేడింగ్‌ ఐదేళ్ల పాటు కొనసాగుతుంది.                        

ఏ డబుల్ ప్లస్ కారణంగా  ఆంధ్రా యూనివర్సిటీకి అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించినట్లయింది.   98 సంవత్సరాల విశ్వవిద్యాలయం చరిత్రలో ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యాక్‌ ప్రమాణాలలో 3.74 శాతం సీజీపీఏతో దేశంలోనే అన్ని విశ్వవిద్యాలయాల కన్నా మొదటి స్థానంలో నిలిచిందన్నారు యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి. సాధారణంగా ఐదు సంవత్సరాలకే న్యాక్‌ గ్రేడింగ్‌ ఇస్తుంది. కానీ యూనివర్సిటీ ప్రమాణాలతో ఏడు సంవత్సరాలకు ఈ గ్రేడ్‌ లభించిందన్నారు. A++ ర్యాంక్‌ను నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాల్సి ఉందన్నారు.                              

పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కులతో కూడిన పట్టాని చేతిలో పెట్టి వ్యవస్థకు ఏయూ స్వస్తి చెబుతూ. యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా. పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ.. ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతూ జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో తొలిసారిగా 86.05 స్కోర్తో నాక్ ఏ గ్రేడ్ పొందిం ది. తరువాత 2008లో 3.64తో ఏ గ్రేడ్ ను 2016లో 3.6 స్కోర్ తో మరోసారి ఏ గ్రేడ్ ను సాధించింది. తాజాగా జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ను పొందింది.                                                            

విశ్వవిద్యాలయాల్లో ఎన్నడూ లేని విధం గా స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, చైర్ ప్రొఫెసర్లని ఏర్పాటు చేయడం తదితర మార్పులు చేశారు. దేశంలో విద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. విశ్వవిద్యాలయం. ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ సాధించి, దేశంలో ఉన్నత స్థానాన్ని పొందడంపై వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, రెక్టార్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.                                                  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Best Country For MBBS : విదేశాల్లో MBBS చేయాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవడానికి ఏ దేశం బెస్ట్?
విదేశాల్లో MBBS చేయాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవడానికి ఏ దేశం బెస్ట్?
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ
జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ
NEET Paper Leak: రూ.140 కోసం నీట్ పేపర్ లీక్ అయిందా? - వెలుగులోకి సంచలన విషయాలు
రూ.140 కోసం నీట్ పేపర్ లీక్ అయిందా? - వెలుగులోకి సంచలన విషయాలు

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Mother Heart Attack:కేంద్రమంత్రి బండి సంజయ్‌ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!
కేంద్రమంత్రి బండి సంజయ్‌ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!
TDP Mahanadu 2026: మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
Bandi Sanjay Gag Order: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
Peddi Producer: 'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
Hyundai V2G Technology: హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!
హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!
CJI Surya Kant Remarks:
"కొందరు యువకులు బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు" సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan: ఊర్లో పెళ్లికి కుక్కుల హడావిడి- విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ రియాక్షన్
ఊర్లో పెళ్లికి కుక్కుల హడావిడి- విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ రియాక్షన్
Breaking News:
"నువ్వే నీ కొడుకుని తీసుకొని రా గౌరవంగా ఉంటుంది" బండి సంజయ్‌కు రేవంత్ సూచన
Embed widget