అన్వేషించండి

Vijayawada News : విజయవాడలో విషాదం, పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Vijayawada News : విజయవాడ కృష్ణలంకలో విషాదం చోటుచేసుకుంది. భర్త మద్యానికి బానిసయ్యాడని తల్లి ఇద్దరు పిల్లలతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

Vijayawada News : విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, పిల్లలు ఇంట్లో పురుగుల మందు తాగి పడిపోయినట్లు భర్త, స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.  కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల తల్లి లక్ష్మి, పిల్లలు నాగమణికంఠ,  జయహర్షగా పోలీసులు గుర్తించారు. 

" అల్లుడు లారీకి వెళ్లి సాయంత్రం వస్తాడు. తాగి వస్తాడు. మా పిల్ల ఎన్నిసార్లు చెప్పిన వాళ్ల నాన్న అల్లుడ్నే సమర్థించేవాడు. ఇటీవల ఇంటికి వచ్చింది. కానీ విషయాలు చెప్పలేదు. పడి పడి ఇంక ఎవరూ తన మాట వినడంలేదని ఇలా చేసింది. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇంత వరకూ రానిచ్చేదానిని కాదు. పిల్లలకు బట్టలకు తీసుకునేందుకు డీమార్టుకు వెళ్తున్నానని చెప్పింది. భర్తకు వంట చేసి వచ్చానని చెప్పింది. ఇంక ఎలా అనుమానం పడతాను. చిన్న చిన్న పిల్లలు. "
--మృతురాలి తల్లి 

ఏం జరిగింది?  

విజయవాడ బాలాజీనగర్ కు చెందిన చలమలశెట్టి గోపాలకృష్ణ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని పాయకాపురానికి చెందిన చందన లక్ష్మి(27)తో 2012లో పెళ్లి జరిగింది. వారికి నాగమణికంఠ(9), జయహర్ష(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లు కృష్ణలంక బాలాజీనగర్ లో నివసిస్తున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణ మద్యానికి బానిసై భార్య, పిల్లల పట్ల పెద్దగా ఆసక్తిని చూపేవాడు కాదు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన చందన లక్ష్మి గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయం తప్పింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడం బంధువుల నుంచి కూడా ఓదార్పులేకపోవడంతో ఆమె మరింత కుంగిపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లిన చందనలక్ష్మి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. 

ఆ తర్వాత ద్రాక్ష జ్యూస్‌లో పురుగుల మందును కలిపి తాను తాగి, పిల్లలతో తాగించింది. రాత్రి ఇంటికి చేరుకున్న భర్త భార్య తలుపులు ఎంతసేపటికి తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో పగలగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. బెడ్‌రూమ్‌లోని మంచంపై భార్య, పిల్లలు నురుగలు కక్కుతూ పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలానికి చేరుకుని వారి ఆసుపత్రికి తరలించారు. తర్వాత ముగ్గురూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Embed widget